టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఆల్రెడీ అతడు, ఖలేజా చిత్రాలు చేశారు. ఈ చిత్రాలు కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా ప్రేక్షకులను బాగానే అలరించాయి. దీంతో వీరి హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుని.. రెండో షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అదేమిటంటే ఈ చిత్రంలో మహేష్ బాబు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నారట. కెరీర్ లోనే మహేష్ బాబు తొలిసారి ఇలాంటి పాత్రలో కనిపించబోతున్నారట. ఇంతకుముందు సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ గా కనిపించిన మహేష్.. ఈసారి ఉద్యోగిగా క్రేజీ రోల్ ను పోషించబోతున్నారని ప్రచారం జరుగుతుంది.
మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, త్రివిక్రమ్ మూవీ అనంతరం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది.