Actor Nani: న్మాచురల్ స్టార్ నాని ఇటీవల `అంటే..సుందరానికీ`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మించారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 10న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్గా హిట్ అవ్వలేకపోయింది.
ఇక ప్రస్తుతం నాని ఆశలన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన `దసరా`పైనే పెట్టుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తెలంగాణలోని సింగరేణి నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నాని మున్నెప్పుడూ చూడని మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. మొన్నామధ్య ఈ సినిమాకి బడ్జెట్ లో సమస్యలు వచ్చాయి అనే వార్తలు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.
అయితే ఆ ఇబ్బందులు తీరడం కోసం నాని తన రెమ్యునరేషన్ లో సగం వెన్నకి ఇచ్చి.. సినిమా నిర్మాణానికి ఉపయోగించాలని సూచించిడట. సినిమా రిలీజ్ అయ్యి లాభాలు వచ్చిన తర్వాతే తన డబ్బులను తీసుకుంటాను అని కూడా నానీ చెప్పాడట. మరి నాని నిజంగా ఆ పని చేశాడో..లేదో తెలియదు గానీ.. ఈ క్రేజీ న్యూస్ మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు నాని నటనే కాదు ఆయన మనసు కూడా గొప్పదే అంటూ పొగిడేస్తున్నారు.