పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే `వినోదాయ సీతాం` రీమేక్. సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గత ఏడాది తమిళంలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.
`వినోదాయ సీతాం` కథ నచ్చడంలో పవన్.. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో కలిసి ఈ మూవీని రీమేక్ చేయాలని భావించాడు. తెలుగులోనూ సముద్రఖనికే దర్శకత్వ బాధ్యతలను ఆప్పగించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భగవంతుడిగా కనిపించనున్నాడని, సాయి ధరమ్ తేజ్ మరణించిన తర్వాత పునర్జన్మను పొందే వ్యక్తిగా అలరిస్తాడని వార్తలు వచ్చాయి.
ఇక త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. పవన్ ఈ మూవీ విషయంలో సాయి ధరమ్ తేజ్కి ఊహించని షాక్ ఇచ్చాడట. `వినోదాయ సీతాం` రీమేక్ పట్టాలెక్కకముందే పక్కన పెట్టేయాలని డిసైడ్ అయ్యాడట.
ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే `వినోదాయ సీతాం`ను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆయన నిర్ణయంతో సాయి ధరమ్ తేజ్ నిరాశలో మునిగిపోయాడని టాక్. ఈ నేపథ్యంలోనే మేనల్లుడిని పవన్ ఊరించి ఊసూరుమనిపించాడంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Pawan Kalyan: సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్.. పవన్ సంచలన కామెంట్..!!
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!