ప్రముఖ నటి పూర్ణ ఇటీవలె వివాహం చేసుకుని ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపార వేత్త షానిద్ ఆసీఫ్ అలీని పూర్ణ వివాహం చేసుకుంది. కానీ, మే 31న పూర్ణ-షానిద్ నిశ్చితార్థం జరగగా.. జూన్ 12న కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
వీరి పెళ్లికి దుబాయ్ వేదికగా నిలిచింది. ఇక పెళ్లి విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టిన పూర్ణ.. తన వెడ్డింగ్ పిక్స్ను సైతం పంచుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. పెళ్లిలో పూర్ణకు ఆమె భర్త షానిద్ ఖరీదైన గిఫ్ట్స్ను ఆమెను సర్ప్రైజ్ చేశాడు.
పూర్ణ పెళ్లి దుస్తుల్లో ఒంటినిండా బంగారు నగలు వేసుకుని దగదగ మెరిసిపోతూ కనిపించింది. ఆ నగలు ఆమె అందాన్ని మరింతగా పెంచాయి. అయితే ఆ నగలన్నీ షానిద్నే కొనిచ్చాడట. ఈ నగలన్నీ 170 తులాలు(1.700కేజీ) ఉంటాయట. అంటే వాటి విలువ కోటికిపైగా ఉంటుందని అంటున్నారు.
అంతేకాదు, బంగారంతో పాటు పూర్ణకు షానిద్ ఓ లగ్జరీ ఇంటిని సైతం గిఫ్ట్ గా ఇచ్చాడని జోరుగా టాక్ నడుస్తోంది. ఆ ఇంటి ఖరీదు కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఇక పూర్ణ ప్రస్తుతం ఆమె భర్తతో దుబాయ్లోనే ఉంటోంది. ఈ నూతన జంట మ్యారేజ్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు.
https://newsorbit.com/cinema/actress-poorna-latest-photos.html