`కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్గా పాపులర్ అయిన కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి ఎన్టీఆర్ ఆర్స్ట్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతోంది. `ఎన్టీఆర్ 31` వర్కింగ్ టైటిల్తో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు.
ప్రీ లుక్ పోస్టర్ను కూడా బయటకు వదలగా.. దానికి విశేష స్పందన లభిస్తుంది. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఈ మూవీపై ప్రశాంత్ నీల్ గుడ్న్యూస్ను వెల్లడించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో `సలార్` మూవీతో చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందే `ఎన్టీఆర్ 31` సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ స్వయంగా వెల్లడించారు. తాజాగా మీడియాతో ఇంట్రాక్ట్ అయిన ఆయనకు ఎన్టీఆర్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
దాంతో ఆయన ఎన్టీఆర్ 31 సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో స్టార్ట్ చేస్తామని, ఈలోగా సలార్ చిత్రీకరణ పూర్తి అయిపోతుందని వెల్లడించారు. ఈ అప్డేట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ కంటే ముందే ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ మూవీ చేయాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.