`ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్న టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. `రెడ్`తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో `ది వారియర్` వంటి మరో మాస్ ఎంటర్టైనర్తో వచ్చాడు.
తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తే.. ఆది పినిశెట్టి విలన్గా చేశాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ మూవీపై రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ది వారియర్తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావించాడు.
కానీ, ఆయన ఆశలు గల్లంతు అయ్యేలానే ఉన్నాయి. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం.. మిశ్రమ స్పందన దక్కించుకుంది. దానికి తోడు టికెట్ రేట్స్ హైగా ఉండటంతో.. కలెక్షన్స్పై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 38.10 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 39.00 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది.
అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 17.69 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టగలింది. వీకెండ్ వరకు బాగానే పర్ఫామ్ చేసినా.. వర్కింగ్ డేస్లో ఈ మూవీ బాగా వీకైంది. ఈ మూవీ క్లీన్ హిట్ అవ్వాలంటే రూ. 21.31 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, అది దాదాపు అసాధ్యమే కాబట్టి.. ది వారియర్తో రామ్కు డిజాస్టర్ ఖాయమని అంటున్నారు.