Trinayani April 12 2024 Episode 1211: ఎందుకైనా మంచిది చుట్టుపక్కల చూడండి అని అంటాడు వల్లభ. ఏమీ లేవు బావగారు అని అంటుంది సుమన. తిలోత్తమ చీరలన్నీ ఇప్పి చూస్తుంది. ఇలా చూస్తే ఏమొస్తుంది అత్తయ్య అని అడుగుతుంది సుమన. పోయినసారి నాగయ్య వచ్చాడు ఈసారి గాయత్రి అక్క వస్తుందేమో అని చూస్తున్నాను అని అంటుంది తిలోత్తమ. ఇలా చూస్తే రాదు చీరలన్నీ నలిపేస్తే అప్పుడు ఉక్రోషంతో ఊరికి వస్తుంది అని అంటుంది సుమన.చిన్న మరదలు జోకులు బానే వేస్తుంది అని అంటాడు వల్లభ. ముందు మీ పెద్దమ్మ వస్తుందో లేదో చూడండి బావగారు అని అంటుంది సుమన. వచ్చింది అని భయపెడుతాడు వల్లభ. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని తిడుతుంది తిలోత్తమ. పెద్దమ్మ రాలేదు కానీ పిల్లమ్మ వచ్చింది అని గాయత్రి పాపని అంటాడు వల్లభ.
నీ సొమ్మేదో పోతున్నట్టు వచ్చేస్తావు ఎందుకు అని అంటుంది సుమన.చేతిలో ఉన్న చీరను తీసి గాయత్రి పాపం మీద విసిరేస్తుంది సుమన. బూచి లాగా ఉంది ఇంకొన్ని చీరలు వేయండి అని తిలోత్తమ అంటుంది. వాళ్ళ అమ్మ చూసిందంటే తిడుతుంది అని అంటుంది తిలోత్తమ. మా నాయిని అక్క పెంపుడు తల్లి కదా అత్తయ్య అని అంటుంది సుమన. ఎంతైనా మీరు విశాల్ బావని పెంచినంత ప్రేమగా మా అక్క పెంచదు అని అంటుంది సుమన. వాళ్ళు వస్తున్నట్టున్నారు చీరలు తియ్యి అని తిలోత్తమ వల్లభకు చెబుతుంది. చీరలు తీస్తూ ఉండగా అమ్మకి పాప మొహం దయ్యంలా కనిపిస్తుంది దాంతో వల్లభ భయపడి పోయి గట్టిగా అరుస్తాడు. అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది అని అడుగుతారు.
ఈ చీరలు ఆ పాప మీద పడగానే నాకు దయ్యం కనిపించింది అని వల్లభ చెబుతాడు. పాపని దయ్యం అని భయపడతాడు ఏంటి అని హాసిని అంటుంది. అమ్మగారి చీరలు ఇలా పడేసారెందుకు అని అంటుంది నైని. గురువుగారు గాయత్రి అక్క చీరల వల్ల మీరు కన్న బిడ్డ జాడ తెలుస్తుంది అని చెప్పారు కదా అందుకే అని అంటుంది తిలోత్తమ. తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకుంటారు మీరు ఇలాంటి పనులు చేయకండి అని చెప్పి వెళ్ళిపోతాడు విక్రాంత్. మా ఆయన ఇంకా వణుకుతూనే ఉన్నాడు అని అంటుంది హాసిని. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే,సుమన విక్రాంత్ గదిలోకి వెళ్లి నేను కట్టుకునే చీరలు ఎందుకు పనికిరావంట అని హాసిని అక్క అంటుంది అని చెప్తుంది. గాయత్రి అత్తయ్య చీరలే మంచి వంట అని అంటుంది. అయినా అసలు గాయత్రి అత్తయ్య గొప్ప ఏంటి అసలు 30ఏళ్లకే చచ్చింది కదా అని అంటుంది సుమన. ఇంకొకసారి చచ్చింది అన్నావ్ అంటే చంపేస్తాను అని విక్రాంత్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,హాసిని నైనీ కలిసి గాయత్రీ దేవి ఎక్కడెక్కడ గుల్లలో చీరలు ఇచ్చింది అని లెక్కలు చూస్తారు. ఇంతలో విశాల్ వచ్చి మీరేం చేస్తున్నారు అని అడుగుతాడు.
గురువుగారు అమ్మ గారి చీరల వల్ల పాప జాడ తెలుసుకోవచ్చని చెప్పారు కదా అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తుంది నైని. ఎక్కడెక్కడ చీరలు ఉంటాయో అక్కడ గాయత్రి పాప ఉంటుంది అనుకుంటుంది నైని అని అంటుంది హాసిని. గాయత్రి పాప ఎందుకు ఉంటుంది అని అనుమాన పడుతుంది నైని. నువ్వే చెప్పావు కదా గాయత్రి పాప అని అంటాడు పావనమూర్తి. వదిన వాళ్ళ మామయ్య వల్ల నిజం బయటపడేలా ఉంది నా బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటాడు విశాల్.కట్ చేస్తే, వల్లభ తిలోత్తమ అఖండ స్వామి దగ్గరికి వెళ్తారు. గురువుగారు ఇంటికి వచ్చి గాయత్రి అక్క చీరల వల్ల పాప జాడ తెలుస్తుందని సెలవిచ్చారు, కానీ ఆ చీరలు ఎక్కడెక్కడ ఇచ్చారో తెలియదు అది ఎలా కనుక్కోవాలో అర్థం కావడం లేదు అని అంటుంది తిలోత్తమ.
అయినా చీరల గురించి గురువుగారికి ఎలా తెలుస్తుంది అని అంటాడు వల్లభ. చీరల గురించి నీకు తెలుసా వల్లభ కొంచెం మగవాడిలా ప్రవర్తించు అని అంటాడు అఖండ స్వామి. ఇది పొగిడినట్టు లేదు తిట్టినట్టు ఉంది అని అంటాడు వల్లభ. నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉండు అని అంటుంది తిలోత్తమ. స్వామి మీరు ఏదైనా దారి చూపించండి అని అంటుంది తిలోత్తమ. అఖండ స్వామి కళ్ళు మూసుకొని ఒక కాటుక తీసి ఇస్తాడు. కాటుకని ఏం చేసుకోవాలి అని అంటాడు వల్లభ. అది అంజన వేసుకోవడానికి అని అంటాడు అఖండ స్వామి. ఆ అంజన మీరు వేయకూడదు ఒక గురువు గారి చేత వేయించాలి అని చెప్తాడు అఖండ స్వామి.
కట్ చేస్తే,తిలోత్తమ అందర్నీ హాల్లోకి రమ్మని చెప్తుంది. అందరూ మౌనంగా నిలబడి చూస్తూ ఉంటారు. అందర్నీ కిందికి రమ్మని చెప్పి ఏం మాట్లాడకుండా ఉంటారు ఎందుకు ఎవరైనా పోయారా అని అడుగుతుంది హాసిని. ఎవరైనా వస్తారేమో చూడాలి కానీ ఎవరైనా పోతారేమో అని చూడకూడదు హాసిని అని అంటాడు పావని మూర్తి. ఏదో చెప్తానని చెప్పి ఇలా మౌనంగా ఉన్నారు ఎందుకు అని అంటుంది హాసిని. రమ్మని చెప్పిన వదినని అడగకుండా మా ఆయనను అంటావేంటి అని అంటుంది దురంధర.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!