Virata Parvam: రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `విరాటపర్వం`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. నందితాదాస్, ప్రియమణి, నవీన్చంద్ర తదితరులు ఈ మూవీ ముఖ్య పాత్రలను పోషించారు.
నక్సలిజం బ్యాక్డ్రాప్లో ఓ చక్కటి ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కామ్రేట్ రావన్నగా రానా కనిపించబోతున్నాడు. అలాగే రవన్న రాసిన పుస్తకాన్ని చదివి అతడి ప్రేమలో పడ్డ యువతి వెన్నెల గా సాయిపల్లవి నటించింది. వీరిద్దరి ప్రేమ కథ సినిమాకే హైలైట్గా నిలవబోతోంది. ఇకపోతే చాలా కాలం నుంచీ విడుదలకు నోచుకోలేకపోతున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
అలాగే ఈ ఈవెంట్కు స్పెషల్గా గెస్ట్లుగా ఇద్దరు స్టార్ హీరోలను దింపబోతున్నారట. ఇంతకీ వారెవరో కాదు.. విక్టరీ వెంకటేశ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే వీరిద్దరితో సంప్రదింపులు సైతం పూర్తి అయ్యాయని అంటున్నారు. అయితే వెంకీ వస్తాడు అన్నదాంట్లో సందేహం లేదు. కానీ, చరణ్ ఇప్పుడు భార్యతో ఫారెన్ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఆయన వెకేషన్ను వదిలిపెట్టి రానా కోసం వస్తాడా..లేదా.. అన్నది చూడాలి.