సోషల్ మీడియాలో అనేక పుకార్లు, అపోహలు ప్రచారం లో ఉంటాయి. ఏది నిజమో, ఏది కాదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కరోనా కాలంలో కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది అనే విషయమై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. దీనిలో తాజా పుకారు ఏమిటంటే…? దోమ కుడితే కరోనా సోకుతుంది అని ప్రచారం ఊపందుకుంది.
కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. మన దేశం ఇప్పుడు ఆరో స్థానానికి చేరింది. కరోనా అనే పదం గడిచిన మూడు నెలలుగా దెస ప్రజల చెవుల్లో వినిపిస్తుంది, నోళ్ళల్లో నానుతుంది. ఇప్పటికే అందరికి ఒక అవగాహనా వచ్చేసింది. ఎలా వస్తుంది? ఎలా రాదూ? అనే విషయాలపై చాల మందికి అవగాహన వచ్చింది. అయితే సోషల్ మీడియా పైత్యం కారణంగా నిజమో, కాదో నమ్మే పరిస్థితి ఉండట్లేదు. ఇంతకు దోమ కాటుకి కరోనా వస్తుందా ? లేదా అనేది ఫాక్ట్ చెక్ లో పరిశీలిస్తే అవాస్తవం అని తేలింది. పిఐబి అనే ఫాక్ట్ చెక్ ఈ విషయాన్నీ స్పష్టం చేసింది. దగ్గులు, తుమ్ములు, లాలాజలం, నేరుగా తాకడం వలన కరోనా సోకుతుందని… దోమల వలన ఉండదని స్పష్టం చేసింది.