మూమూస్ గురించి వివరించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేని అందరికి తెలిసిన వంటకం. నేపాల్, చైనాలో విపరీతంగా తినే ఫుడ్ ఇది. వీటి కారణంగా ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడవచ్చు.
మూమూస్ తింటే ఎవ్వరికైనా ప్రాణాలు పోయి చనిపోతారా అని అనేముందు… చైనాలో జరిగిన ఈ సంఘటనగురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చైనా లోని జియాంగ్సు ప్రావిన్స్ కి చెందిన వాంగ్ అనే వ్యక్తికి మూమూస్ అంటే మహా ఇష్టం. వాంగ్ అవి తినకుండామాత్రం అస్సలు ఉండలేడు.
అయితే అతను ఈ మధ్య రాత్రి భోజనానికి తనకి ఎంతో ఇష్టమైన మూమూస్ లాగించేశాడు.
ఆ మూముస్ కూడా రెడ్ చిల్లీ సాస్ తో తయారు చేసినవి. చాలా స్పైసీగా ఆర్డర్ ఇచ్చుకొని మరీ తినేసాడు . అంతటితో ఆగకుండా అందులోకి మళ్లీ మళ్ళి చిల్లీ చట్నీ అద్దుకొని మరీ తిన్నాడు.అవి తిన్న తర్వాత ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అర్థరాత్రి అవుతుండగా వాంగ్ కడుపులో విపరీతమైన మంట మొదలైంది. కడుపులో ఏదో పేలుతున్నట్లుగా కూడా అతను గమనించాడు.
వెంటనే భయంతో వణికిపోయాడు.కడుపులో వస్తున్నా విపరీతమైన మంట ను తట్టుకోలేక,వెంటనే హాస్పిటల్ కి చేరుకున్నాడు . వాంగ్ పరిస్థితి చూసిన డాక్టర్లు సైతం షాకయ్యారు. అతని పొట్టలో పేగులు దాదాపు మాడిపోయినట్లుగా కనిపించాయి. కారం ఎక్కువగా ఉన్న మూమూస్ తినడం వల్ల అతని పొట్టలో గ్యాస్ తయారై, అది కాస్త ఒత్తిడికి గురై పేలిపోయింది.
దీంతో అతని పొట్టలోని పేగులు మాడిపోయాయి. వైద్యులు వెంటనే అతనికి వైద్యం అందించారు. అయితే.. అతనికి గతంలోన కూడా పొట్ట సంబంధిత సమస్యలుఉండడం తో కారం అస్సలు తినవద్దని వైద్యులు సూచించారట . అది పెడచెవిన పెట్టి కారం విపరీతం గా తినేయడం తో ప్రాణాల మీదకు వచ్చిపడింది .ఇక నుంచి మీరు కూడా మూమూస్ తినేటప్పుడు ఎక్కువగా కారాం తినకండి. మూమూస్ అనే కాదు.. ఎక్కువ కారం, ఘాటు తినడం ఎవరి పొట్టకి మంచిది కాదు.