కరోనా ప్రభావం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు అలాంటి వైపు మొగ్గు చూపుతున్నారు. అల్లం టీ తాగడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అల్లం టీ లో ఎక్కువ శాతం యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల అనేక రకాల వైరస్, బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. మన శరీరంలో అధికశాతం రోగనిరోధక శక్తి ఉండటం వల్ల కరోనా వైరస్ వంటి మహమ్మారిని నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది. అయితే అల్లం టీ ని కొందరు వివిధ రకాల పద్ధతులలో తయారుచేసుకుని తాగుతారు.
అల్లం ని బాగా దంచి వేడి నీటిలో బాగా మరగబెట్టి చల్లారిన తర్వాత అందులోకి కొద్దిగా తేనె కలుపుకొని తాగడం ద్వారా తీవ్రమైన దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా అల్లం, మిరియాలు, తులసి ఆకులు పది నిమిషాల వరకు బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ కషాయాన్ని వడపోసుకొని అందులో కొద్దిగా రుచికోసం తేనె లేదా చక్కెరను కలుపుకుని తాగవచ్చు.
అధిక జలుబు సమస్యతో బాధపడేవారు పాలలో కొద్దిగా అల్లం ముక్కలు బాగా మరిగించి, గోరువెచ్చగా చల్లార్చిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని రాత్రి పడుకునే సమయంలో తాగడం వల్ల తీవ్రమైన జలుబు సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. శ్వాస తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ అల్లం టీని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగడం ద్వారా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న ఉద్దేశంతో రోజులో ఎక్కువ సార్లు ఈ అల్లం టీ తాగడం వల్ల అనేక సమస్యల బారిన పడతారు. ఎక్కువగా ఈ టీ తాగడం ద్వారా కడుపులో మంట, గ్యాస్ ఫార్మేషన్ వంటి సమస్యల బారినపడే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఎటువంటి సమస్యలతో నైనా బాధపడుతూ, మెడిసిన్స్ తీసుకుంటున్నవారు అల్లం టీని డాక్టర్ల సలహా మేరకు తీసుకోవచ్చు. ఇంతటి ఔషధ గుణాలున్న ఈ అల్లం టీ రోజుకు రెండు సార్లు మాత్రమే తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచిది.