స్నానం చేస్తే మనిషికి ఎక్కడలేని హాయి ,ఉత్సహం వస్తాయి. స్నానం తో శరీరం సేద తీరుతుంది. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. స్నానం అనేది ఒక భోగం కాబట్టి నెమ్మది గా స్నానం చేస్తూ ఆ భోగాన్ని అనుభవించండి…
చాల మందికి రాత్రిళ్లు స్నానం చేయకపోతే అస్సలు నిద్ర కూడా పోలేరు.రాత్రిపూట పడుకునే ముందు స్నానం చేస్తే ఆ రోజు తాలూకు అలసట అంతా పోయి ప్రశాంతం గా ఉంటుంది. అయితే కొంత మంది రాత్రి భోజనం అయ్యాక స్నానం చేస్తే..బాగా శుభ్రం గా ఉండి హాయిగా నిద్రపడుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ, అదిఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.
ఎప్పుడు భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయండి. రాత్రి సమయంలో మాములు నీళ్లతో కంటే గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. రాత్రి సమయంలో గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే అలసట తగ్గి త్వరగా నిద్ర పడుతుంది.. గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయడం వలన కండరాల కు విశ్రాంతికలుగుతుంది .
రాత్రిళ్ళు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే రక్తపోటు అదుపులో ఉంటుంది అంటున్నారు నిపుణులు. అంతేకాదు, టైపు 2 డయాబెటిస్ సమస్య కు కూడా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.చాలామంది పడుకొనే ముందు స్నానం చేస్తే బాగా నిద్రపడుతుందిఅని అపోహలో ఉంటారు. అలా చేయడం వలన శరీరానికి చురుకుదనం వస్తుంది కానీ ఓ పట్టాన కునుకు రాదంటున్నారు నిపుణులు . అందుకే పడుకోవడానికి కనీసం గంట ముందు స్నానం పూర్తి చేయాలి.