Assembly Election Results 2022: దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వం కొనసాగుతోంది. ఊహించినట్లుగానే అతిపెద్ద రాష్ట్రంలో యూపీలో రెండవ సారి బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. పంజాబ్ లో ఆప్ స్వీప్ చేయగా, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ దక్కే పరిస్థితి కనబడం లేదు.
Assembly Election Results 2022: మణిపూర్, గోవాలో కీలకంగా స్వతంత్రులు
మణిపూర్ రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలకు గానూ 29 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉండగా, కాంగ్రెస్ 11, ఎన్ఫీఎఫ్ 4, ఎన్పీఈపీ 9, ఇతరులు 9 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. ఎన్పీపీతో కాంగ్రెస్ మంతనాలు సాగిస్తుండగా, స్వతంత్రులతో బీజేపీ చర్చలు జరుపుతోంది. అదే విధంగా గోవాలోనూ స్వతంత్రులు, టీఎంసీ, ఆప్ అభ్యర్ధులు కీలకం కానున్నారు. 40 స్థానాలు ఉన్న గోవాలో బీజేపీ 19, కాంగ్రెస్ 10 ఏఏపీ 1, టీఎంసీ 4, ఇతరులు 6 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. ఇటు గోవా, అటు మణిపూర్ లోనూ బీజేపీ స్వతంత్రుల మద్దతు తీసుకుంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. గోవాలో ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.
పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ ఛన్నీ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ వెనుకంజలో ఉన్నారు. అదే విధంగా పంజాబ్ పీసీసీ ఛీప్ సిద్దూ కూడా వెనుకంజలో అన్నారు.
ఉత్తరప్రదేశ్ లో 403 స్థానాలు ఉండగా 273 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కొనసాగుతుండగా, ఎస్పీ 117, బీఎస్పీ 5, కాంగ్రెస్ 2, ఇతరులు ఆరు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. పంజాబ్ లో అఖండ విజయంతో ఆప్ సంబరాలు చేసుకుంటోంది.
Read More: Assembly Election Results 2022: పంజాబ్లో జయకేతనం దిశగా అప్..మ్యాజిక్ ఫిగర్ దాటి