Vijay Malya: విజయ్ మాల్యా , నీరవ్ మోడీ. ఈ ఇద్దరి గురించి పరిచయం అవసరం లేదు. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఈ ఇద్దరు. అయితే, తాజాగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతని బంధువు మెహుల్ చోక్సీ ఆస్తుల విషయంలో ఓ తీపికబురు. ఈ ముగ్గురికి చెందిన మరో రూ.792.11 కోట్ల బాకీలను స్టేట్ బ్యాంక్ నాయకత్వంలోని బ్యాంకుల కన్సార్షియం రికవరీ చేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రకారం వీరి ఆస్తులను సీజ్ చేశామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది.
Read More: Modi: తండ్రి కాంగ్రెస్… కొడుకు బీజేపీ… మోడీ వల్లే ఇద్దరు కలిసి సృష్టించిన రికార్డు ఇది
ఇవి వాళ్ల మోసం లెక్క…
దివాలా తీసిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ యజమాని మాల్యా బ్యాంకుల కన్సార్షియానికి రూ.తొమ్మిది వేల కోట్లు బాకీ ఉన్నాడు. మోడీ, చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13 వేల కోట్లకు మోసం చేశారు. ఈడీ ఇచ్చిన ఆస్తులను అమ్మడం ద్వారా ఇది వరకే ఈ కన్సార్షియానికి రూ.7,181.50 కోట్లు వచ్చాయి. తాజాగా జప్తు చేసిన వాటిలో కొన్ని ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని ఈడీ వెల్లడించింది. ఈ ముగ్గురి నుంచి ఇప్పటి వరకు వసూలు చేసిన ఆస్తుల విలువ రూ.13,109 కోట్లని తెలిపింది.
Read More: Modi: మోడీ విషయంలో చాలా మంది చేయలేని పని ఈ యువ మంత్రి చేసేశాడు
ఈ ముగ్గురు ముదుర్లే…
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఆయన బంధువు బ్యాంకులకు రూ.22,585 కోట్లు చెల్లించాలని ఈడీ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం కూడా ఈ సంస్థ వీరికి చెందిన రూ.3,644.74 కోట్ల విలువైన షేర్లను రూ.29.59 కోట్ల విలువైన స్థిరాస్తులను, రూ.54.33 కోట్ల విలువైన డీడీలను కన్సార్షియానికి అందజేసింది. మొత్తంగా ఈ ఆస్తుల జప్తుతో భారతీయులు వీరి మోసం విషయంలో ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.