Maharashtra: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద గోడ కూలి గుడిసెలపై పడటంతో 17 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ఓ భవనం కలి అయిదుగురు మృతి చెందారు. ఈ ఘటనలు ఆదివారం ఉదయం సంభవించాయి. మృతుల సంఖ్య 22 కు చేరింది.
వివరాల్లోకి వెళితే.. భారీ వర్షాల కారణంగా చెంబుర్ ప్రాంతంలోని భరత్నగర్ కాలనీలో కొండచరియలు విరిగిపడటంతో గోడ కూలి గుడిసెలపై పడింది. ఘటనా స్థలికి ముంబయి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని 16 మందిని రక్షించారు. శిధిలాల కింద మరి కొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో పక్క భారీ వర్షాల కారణంగా ముంబయిలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. హనుమాన్ నగర్, కందివల్లి తూర్పు ప్రాంతాల్లోని చాలా ఇళ్లలో వరద నీరు ప్రవేశించింది. చాలా ప్రాంతాల్లో రోడ్డు మార్గాల్లో దెబ్బతిన్నాయి. ముంబయిలోని విక్రోలి ప్రాంతంలో ఓ భవనం కూలి అయిదుగురు మృతి చెందారు. శిధిలాల కింద మరో అదుగురు ఆరుగురు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అధకారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు బీఎంసి అధికారులు వెల్లడించారు.
కాగా రెండు ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుండి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50వేల వంతున పరిహారం అందిస్తున్నట్లు పిఎంఒ ప్రకటించింది. ముంబయిలో జరిగిన ఈ ప్రమాధ ఘటనలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
Deeply saddened by the news of many casualties in incidents following heavy rain in Mumbai's Chembur and Vikhroli areas. I express my condolences to the bereaved families and wish for successful relief and rescue work, tweets President Ram Nath Kovind pic.twitter.com/cT5f2sQs56
— ANI (@ANI) July 18, 2021