బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది క్షణాలకే నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలో ఉన్న పార్టీలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు అని బిజెపి చేసిన వ్యక్తులను కొట్టి పారేశారు. అంత మాత్రమే కాదు 2024 సార్వత్రిక ఎన్నికల ఉద్దేశించి బిజెపిని టార్గెట్ గా చేసుకుని సీరియస్ కామెంట్లు చేశారు.
2014లో మోడీ గెలిచారు కానీ 2024లో అంటూ ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపిని గద్దె దించడానికి దేశంలో ప్రతిపక్షాల పార్టీలన్నీ ఐక్యం కావాలని కోరారు. వచ్చే లోక్సభ ఎన్నికల విషయంలో మోడీ ఆందోళన చెందుతున్నారని నితీష్ ఆరోపించారు. ఇదే సమయంలో బిజెపిని వీడాలని తమ పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం అని చెప్పుకొచ్చారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
బీజేపీకి షాక్ ఇస్తూ ఎన్డీఏ కూటమి నుండి రెండోసారి జెడియు బయటకు వచ్చేయడం జరిగింది. బీజేపీతో పొద్దు నుండి బయటకు వచ్చాక బీహార్ లో ఏడు పార్టీల మద్దతుతో తాజాగా నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో కొత్తగా బీహార్ లో ఏర్పడిన ప్రభుత్వం ఎల్లకాలం సాగదు అని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?