AP High Court: గుజరాత్కు చెందిన అమూల్ సంస్థతో ఏపి ప్రభుత్వం రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎంవోయు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టింది.
రఘురామ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. దీనిపై నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, గుజరాత్ లోని అమూల్ కి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అముల్ త కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై ఎలాంటి నిధులను ఏపి ప్రభుత్వం ఖర్చు చేయవద్దని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.
ఏపిడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.