అమరావతి: ఎపీలో ఎనిమిది మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్, సీఐడీ డీఐజీగా సునీల్ కుమార్ నాయక్, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా కేఆర్ఎం కిషోర్ కుమార్, రైల్వే అడిషనల్ డీజీగా బాల సుబ్రమణ్యం, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండెంట్గా అభిషేక్ మహంతిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్గా వినీత్ బ్రిజ్లాల్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ హరికుమార్ను నియమించిన ప్రభుత్వం కృపానంద త్రిపాఠిని డీజీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
previous post