అమరావతి: స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై సందేహాలు వద్దనీ, ఈవిఎంలు భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదనీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
ఈవిఎంలు ఉంచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రత ఉందని ద్వివేది చెప్పారు. రాజకీయ పార్టీలు తమ ఏజంట్లను స్ట్రాంగ్ రూమ్ సమీపంలోని కంట్రోల్ రూమ్లలో ఉంచవచ్చని తెలిపారు.
ఈవిఎంలు భద్రపరిచిన చోట ఇంటర్నెట్ సౌకర్యం ఉండదనీ ద్వివేది అన్నారు. అపోహలకు తావివ్వకుండా ఉండేలా భద్రత కల్పించామనీ, వైఫై ద్వారా ఈవిఎంలను నియంత్రిస్తారనే ప్రచారం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ద్వివేది పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్ లపై వచ్చినవి వదంతులు మాత్రమేననీ, వదంతులు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ద్వివేది ఆదేశించారు.