KCR: తెలంగాణ ఉద్యమం నుండి ఉద్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇవేళ నుండి జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఅర్ఎస్) గా రూపాంతరం చెందింది. పార్టీ పేరును మార్పు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిన్న కేసిఆర్ కు లేఖ రాయగా, ఇవేళ ఆ లేఖపై కేసిఆర్ సంతకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక నుండి మాజీ సీఎం కుమారస్వామి, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ హజరై కేసిఆర్ కు అభినందనలు తెలియజేసారు.
సజ్జల: షర్మిల కోసమా..! కేసిఆర్ కోసమా..! ఈ మౌనం వెనుక అర్ధం ఏమిటి..?
ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ .. ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నినాదం ఆబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్ (వచ్చేది రైతు రాజ్యం) అని తెలిపారు. ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని అదే రోజు సభను కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలవాల్సింది రాజకీయ పార్టీలు కాదనీ, ప్రజలని కేసిఆర్ అన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్ధిక విధానం అవసరమని అన్నారు. కేంద్ర పాలకుల వైఫల్యంతోనే రాష్ట్రాలకు నీటి కష్టాలు ఏర్పడుతున్నాయని, ట్రిబ్యూనల్ తో రాష్ట్రాల మద్య గొడవలు పెట్టే సంస్కృతి పోవాలన్నారు. రాష్ట్రాల మధ్య పంచాయతీలు ఎందుకు.. దేశంలో రాష్ట్రాల మద్య గొడవలు ఎందుకు వస్తున్నాయి..బకెట్ నీటి కోసం కూడా రాష్ట్రాలు కొట్టుకునే పరిస్థితి ఉందన్నారు. దేశంలో జల వినియోగం సరిగాలేదని, అన్ని అవసరాలు పోను నీళ్లు మిగులుతాయని కేంద్ర పాలకుల వైఫల్యంతోనే నీటి కష్టాలు అని అన్నారు కేసిఆర్. ఈ సమస్యలు అన్నీ పోయి కొత్త శకానికి నాంది పలకాలని అందుకే బీఆర్ఎస్ ను తీసుకురావడం జరిగిందన్నారు.
దేశంలో మహిళా సాధికారిత కోసం కొత్త విధానాన్ని అమలు చేయాలన్నారు. అదే విదంగా కొత్త పర్యావరణ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ జాతీయ పాలసీలను రూపొందిస్తామని తెలిపారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పొత్తుతో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని, బీఆర్ఎస్ తరపున కర్ణాటకలో ప్రచారం కూడా నిర్వహిస్తానన్నారు కేసిఆర్. కుమార స్వామి మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.
TRS to BRS: తెలంగాణలో కాంగ్రెస్ పతనానికి బీజం పడి పదమూడు ఏళ్ళు