కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది.కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. మునపటి కంటే ఈసారి రోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని డబ్యూహెచ్వో వెల్లడించింది. తాజాగా ప్రపంచ దేశాలలో ఒక రోజులో భారీ సంఖ్యలో 6,57,312 కోవిద్-19 కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. గడచిన 24 గంటల్లో యూరప్ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యా లో 2.85 లక్షలకు పైగా కేసులు నమోదైనట్టు చెప్పింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 5,31,64,803కు చేరుకుంది.
కరోనా వైరస్ తో ఒకే రోజులో ప్రపంచవ్యాప్తంగా 9,797 మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. కొత్తగా నమోదు అయినా కరోనా మరణాల సంఖ్యా తో, ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 13,00,576 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక 37,601,889 మంది కోవిడ్తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆర్ధికం గా అగ్ర రాజ్యం అయినా అమెరికా, కరోనా వైరస్ కేసుల లో కూడా మొదటి స్థానంలోనే ఉంది. అమెరికా లో ఇప్పటివరకు 11,226,038 కేసులు నమోదు అవ్వగా, 251,256 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇక అమెరికా తరువాతి స్థానంలో ఉన్న భారత్ దేశంలో ఇప్పటివరకు నమోదు అయినా కేసులు సంఖ్యా 8,814,902 కాగా, మరణాలు 129,674 నమోదు అయ్యాయి. అయితే కరోనా కేసులు సంఖ్యా లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ దేశం రెండొవ స్థానం లో ఉనప్పటికీ, రికవరీ రేట్ కూడా ఎక్కువ గా ఉంది. భారత్ దేశం తరువాతి స్థానాలలో బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా, స్పెయిన్ ఉన్నాయి.