న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి తుగ్లకాబాద్ మురికి వాడలో ఈ ప్రమాదం జరగగా సుమారు రెండు ఎకరాల మేర విస్తీర్ణంలో మంటలు ఎగిసాయి. ఈ ప్రమాదం కారణంగా సుమారు పదిహేను వందల గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న పైర్ అధికారులు 30 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.