బాలీవుడ్ ను దశాబ్దాల నుంచి ఏలుతున్న మహారాణులు ఉన్నారు. పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు. కానీ.. వాళ్లందరినీ తోసిరాజని దిశా పఠానీ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఎవ్వరికీ దక్కని అరుదైన గౌరవాలు దిశాకే దక్కుతున్నాయి.
దిశా పఠానీ.. అందరు హీరోయిన్లలా కాదు.. తన మీద ఎటువంటి విమర్శలు వచ్చినా.. ఏ మాత్రం పట్టించుకోదు. దిశ ఆ హీరోతో డేట్ చేస్తోందట? ఈ హీరోతో డేట్ చేస్తోందట? అంటూ మీడియాలో ఎన్నికథనాలు వచ్చినా.. ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది అంతే.
తన మనస్తత్వమే కాబోలు.. తనకు సోషల్ మీడియాలో పాపులారిటీని పెంచింది. ఎందుకంటే.. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ కు కూడా ఇంత త్వరగా సోషల్ మీడియాలో పాపులారిటీ రాలేదు. కానీ.. దిశకు ఇన్ స్టాగ్రామ్ లో అప్పటికే 40 మిలియన్ల ఫాలోయర్స్ వచ్చి చేశారు. 40 మిలియన్లు అంటే 4 కోట్ల మంది అన్నమాట.
స్టార్ హీరోయిన్లు అనుష్క శర్మ, అలియా భట్, కత్రీనా కైఫ్, దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా లాంటి వాళ్లకు కూడా ఇంత త్వరగా 40 మిలియన్ల ఫాలోయర్స్ రాలేదు.
2016లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. వచ్చిన నాలుగేళ్లలోనే తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకొని బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ హోదాకు వెళ్లిందంటే మామూలు విషయం కాదు.
బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక ఫాలోయర్లు ఉన్న హీరోయిన్.. ప్రియాంక చోప్రా. తనకు 57.6 మిలియన్లు ఫాలోయర్లు ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నారు. ఆ తర్వాత శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే ఉన్నారు.
https://www.instagram.com/p/CFEr-9AANKx/
https://www.instagram.com/p/CEt3DQJAJwM/
https://www.instagram.com/p/CAe7yB9AWyR/