YSRCP:ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టికెట్ రాని అసంతృప్తులు పలువురు పక్క పార్టీలో చేరుతున్నారు. టీడీపీ అసంతృప్తులు వైసీపీలో చేరిపోతున్నారు. తాజాగా కావలి టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి.
1989, 2004 ఎన్నికల్లో అల్లూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణువర్థన్ రెడ్డి..ఆ తర్వాత కావలిలో 2009 లో కాంగ్రెస్ తరపున, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.
ఈ సారి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయాలని ఆయన భావించారు. కానీ టీడీపీ లో ఆయనకు టికెట్ దక్కలేదు. కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది. దీంతో టీడీపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విష్ణువర్థన్ రెడ్డి ..ఇటీవల టీడీపీకి రాజీనామా చేశారు.
ఇవేళ ఎద్దల చెరువు వద్ద బస్సు యాత్రలో తన అనుచరులతో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు విష్ణువర్థన్ రెడ్డి. ఆయనకు, ఆయన అనుచరులకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Janasena: ఆవనిగడ్డ అభ్యర్ధిని ప్రకటించిన జనసేన