Lord Shiva: సాధారణంగా పిడుగు అంటే అందరూ భయపడతారు… పిడుగు పడిన ప్రదేశంలో ఒక చెట్టు కానీ మనిషి కానీ ఏది ఉన్నా పిడుగు దాటికి సజీవదహనం అయిపోతుంది. అదే పిడుగు కచ్చితంగా ప్రతి ఏడాది ఒక ఆలయంపై పడుతూ ఉంటె??? ఆ ఆలయం ఎలా ఉంటుందో ఇంక మనం ఉహించక్కర్లేదు. కానీ ఈ ఆలయం మీద ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారి అయినా పిడుగు పడుతుంది. అది కూడా నేరుగా గర్భగుడిలోని శివలింగం పైనే పడుతుంది. ఆ పిడుగు దాటికి శివలింగం విరిగిపోతుందట. కానీ కొన్ని రోజులకు మళ్ళి ఆ శివలింగం పూర్వరూపంలో వచ్చేస్తుంది. మొదటిసారి వింటున్న వారికి ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇది నిజం… ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా?
ఈ పిడుగుల పరమేశ్వరుని ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని కులు-మనాలిని నుంచి సరిగ్గా 22 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని ‘బిజిలీ మహాదేవ్’ ఆలయంగా స్థానికులు పిలుస్తుంటారు.
అసలు ఒకసారి విరిగిన శివలింగం మళ్లీ పూర్వ స్థితికి ఎలా చేరుకుంటుంది అనే విషయం తెలుసుకోవడానికి ఇప్పటికే ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, ఎటువంటి ఫలితం లేదు. సాధారణంగా ఒకసారి రాయి మీద పిడుగు పడితే ఆ రాయి ముక్కలుగా అయిపోయి అది ఎం చేసినా మళ్ళి పూర్వస్థితికి రాదు. మరి అలాంటప్పుడు అక్కడి పూజర్లు కేవలం పిండి, తృణధాన్యాలను ఉపయోగించి ఆ శివలింగాన్ని అతికిస్తే అది ఎలా అతుక్కుంటుంది అంటే అది ఇప్పటికీ ఒక మిస్టరీ గానే మిగిలింది. ఈ ఆలయం ముఖ్యంగా శివరాత్రి రోజున భక్తులతో పూర్తి ఆధ్యాత్మికత ను సంతరించుకుని కిక్కిరిసిపోతుంది. అంతేకాదు, ఈ ఆలయం డిసెంబరు మరియు జనవరి నెలల్లో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.