ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచమంతా కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించాల్సిన టి20 వరల్డ్ కప్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈరోజు ఆన్లైన్ లోనే వర్చువల్ గా మీటింగ్ నిర్వహించిన అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య బోర్డు ఇప్పుడున్న పరిస్థితుల్లో టి20 వరల్డ్ కప్ ను నిర్వహించడం అసాధ్యమని తేల్చేసింది.
ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా హోస్ట్ చేయాల్సి ఉంది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా ప్రస్తుతం కరోనా ప్రభావం ప్రపంచమంతా ఎక్కువున్న నేపథ్యంలో వరల్డ్ కప్ ను హోస్ట్ చేయలేము అని చేతులెత్తేసింది. అక్టోబర్ 18 నుండి నవంబర్ 15 వరకూ ఈసారి టి20 వరల్డ్ కప్ ను నిర్వహించాల్సి ఉంది. మొత్తానికి ఈ ఏడాది పొట్టి ప్రపంచ కప్ లేనట్లే.