నాడు కిరణ్ … నేడు రఘు లాస్ట్ బాల్ గేమ్…
అవును ఈ స్టోరీ మళ్లీ వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి. చాన్నాళ్లుగా ట్రెండింగ్ లో ఉన్న త్రిబుల్ ఆర్ పరపతి త్వరలోనే సన్యాసంలో కలవబోతోందంటూ వార్తలు గుప్పమంటున్నాయ్…
ఢిల్లీలో తనకు తిరుగులేదంటూ బాకా ఊదిన త్రిబుల్ ఆర్ ఇప్పుడు విగ్గు తీసేయాల్సిన సమయం వచ్చేసింది.వాస్తవానికి ఆయన గెలవడమే ఒక వండర్. గెలిచాడు పో… తనపని తాను ఏదో చేసుకోవచ్చు కదా… ఇండివిడ్యువాలిటీ అన్న పేరుకు అసలు అర్థం తెలిసిన వ్యక్తి అసలు వైసీపీలో చేరడమేంటి… అక్కడ తనకు గౌరవం లేదని చెప్పడమేంటి… చిల్లర యాపారం కాకకుంటే… రఘురామకృష్ణంరాజు పరిస్థితి ఇప్పుడు అలాగే మారింది. తిరుమల భూముల విక్రయం దగ్గర మొదలుపెట్టిన లొల్లి ఇప్పుడు కులం గోడలు చీల్చి హస్తన వీధుల్లో మార్మోగింది. అడిగిందే తడవుగా అన్నీ చానళ్లకు లైవ్ లో తన ఉప్పర సోదితో దంచేసిన త్రిబుల్ ఆర్ ఇప్పుడు భవిష్యత్ ఏంటో అర్థం కాక తలపట్టుకుంటున్నాడట.
తనకు నాలుగు రోజుల్లో కేంద్రం సెక్యురిటీ కల్పిస్తుందని గొప్పులు పోయిన విగ్గు రాజుకు ఇప్పుడు కేంద్రం రిక్త హస్తం చూపించిందట… మొమున్నామంటూ మొన్నటి వరకు స్నేహహస్తం అందించిన పెద్దలు ఇప్పుడు విగ్గుతో అంతగా వర్గౌట్ కాదని నిర్ణయానికి వచ్చేశారట… అందుకే లోక్ సభలో సీట్ వరుసను కూడా మార్చేశారట… ఇదంతా లైట్ యవ్వారమంటూ మన త్రిబుల్ ఆర్ ఓ రేంజ్ లో మళ్లీ బాకా బాగా ఊదేస్తున్నాడు. ఐతే విషయమేంటంటే… ఆర్ఆర్ఆర్ లెక్కలు కూడా పాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలాగానే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. రాష్ట్ర విభజన పూర్తయిపోతున్నా… తన పదవే ముఖ్యమనుకొని చివరి బాల్ సిక్సర్ కొడతానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి జనాలను పాడు చేసిన ఘనత నల్లారి వారిదైతే… తన పదవిని ఎలా కాపాడుకోవాలన్నదాని కోసం టైమ్ పాస్ రాజా చాలా కథలు చెబుతున్నాడు. చెప్పేవాడికి వినేవాడు లోకువ లెక్కన మన త్రిబుల్ ఆర్ ఇప్పుడు టీవీల ముందు కుర్చొని ఎక్సు క్లూజివ్ గా చెవిలో పువ్వులు పెడుతున్నాడు.
ఒకటి మాత్రం నిజం.. జగన్ వచ్చి చెప్పినట్టు వింటాను… మీ మాట జవదాటనంటూ ఢిల్లీ పెద్దలకు కోరిందే తడవుగా వివరణలు ఇస్తుంటే విగ్గు రాజా అవసరమా వారికీ…ఈ చిన్న లాజిక్కు త్రిబుల్ ఆర్ మరచిపోయినట్టున్నాడు. అందుకే కిరణ్ కుమా రెడ్డి యవ్వారం గుర్తుకొస్తోంది. బైబై రాజు టైమ్ చాలా దగ్గర్లోనే ఉందనుకోవాలి. త్వరలోనే విగ్గు రాజాకు షాక్ తప్పదని హస్తిన వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయ్. ఎన్నికలకు బీజేపీ ఇప్పుడు ఎంత మాత్రం సిద్ధంగా ఉండదు. కానీ విగ్గు తొలగించి మరోకరికి లైన్ క్లియర్ చేస్తే అందుకు వైసీపీ పెద్దల నుంచి కూడా సానుకూలత లభించే అవకాశం లేకపోలేదు. కరోనాతో జనం చస్తుంటే చివరి బాల్ అస్త్రమంటూ ఎంపీ నిధులను రామాలాయనికి ఇచ్చాడట రాజా వారు. అవును నియోజకవర్గానికి వెళ్లలేడు. అలాగని పార్టీతో ఉండలేడు. ఇక రాములోరికి పూజలు మాత్రమే చేయగలడు.