జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటుందని స్థాపించిన సమయంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఎక్కువగా మాత్రం ఏపీ రాజకీయాల పై నే ఫోకస్ పెట్టి పవన్ పొలిటికల్ అడుగులు వేయడం జరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి- బిజెపి కూటమితో కలసి పోటీ లో దిగిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత పవన్ బీజేపీతో చేతులు కలిపి ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ కి సంబంధించి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు హయాంలోనే మొండిచేయి చూపించడం అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించడం తో కేంద్రంపై ఇప్పటి అధికార పార్టీ వైసిపినేతలు అదేవిధంగా ఏపీ ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టును రూల్ ప్రకారం కేంద్రం కంప్లీట్ చేయాలని అలాంటప్పుడు ఎలా చేతులు దులుపుకునే రీతిలో బిజెపి వ్యవహరించటం సమంజసం కాదని అంటున్నారు. ఇదిలా ఉండగా బిజెపికి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఏపీకి జరిగిన అన్యాయం విషయంలో కేంద్రం పై ఇప్పటి వరకు సరైన రీతిలో స్పందించకపోవటం పై విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నిస్తాను అని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, అసలైన సమయములో ప్రశ్నించాల్సిన తరుణం లో పైగా మిత్రపక్ష పార్టీనే అయినా మాట్లాడకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వరదల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిన పవన్ … పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక్క మాట కూడా అనక పోవడాని సొంత పార్టీ క్యాడర్ తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు విషయంలో స్పందించడం మానేసి హైదరాబాద్ వరదల మీద పవన్ కళ్యాణ్ కి ఎందుకు అంత శ్రద్ధ వహించడం అవసరమా అని ఏపీ జనసేన పార్టీ క్యాడర్ లోలోపల చర్చించుకుంటున్నాట్లూ టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా ఏపీ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును నిలదీయాల్సిన పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండటం పట్ల ఏపీ జనసేన పార్టీలో తీవ్రస్థాయిలో అసహనం నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.