1968 లో భారతదేశం పేకాటను స్కిల్ గేమ్ గా గుర్తించింది. దీనిపై పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది. పేకాట ఆడటం వాళ్ళ మానసిక నైపుణ్యం పెరుగుతుంది అని గుర్తించింది. దీని తర్వాత పేకాట ను చాలా రాష్ట్రాలు నిషేధించాయి. మాకు ఈ కార్డుల గోల వద్దని ప్రత్యేక చట్టాలు చేసాయి. ఇలా పుట్టుకొచ్చిందే ఏపి గేమింగ్ యాక్ట్ 1974 . ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ చట్టంలో కొన్ని మార్పులు , చేర్పులు చేసేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది.
1930 లో ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ కాలంలోని గేమింగ్ యాక్ట్, 1350 రాజులకాలం నాటి తెలంగాణ జూద నేరం చట్టాలను 1974 లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దీన్ని తీసుకువచ్చారు. 17 పూర్తిస్థాయి లో రూపొందిన అంశాలతో దీన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. జూదం, గ్యాంబ్లింగ్, డబ్బుతో ఆడే ఆటలతో పాటు అప్పట్లో ఎక్కువగా గుర్రపు పందేల జోరు ఉండేది. దీనికి చట్టంలో ప్రత్యేకమైన చర్యలు లేకపోవడంతో గుర్రపు పందేలు, రాయలసీమలో మట్కా నిరోధానికి దీన్ని తీసుకువచ్చారు. అలాగే కాటన్ ధరల్లో వ్యత్యాసం లేకుండా చూసేందుకు ఏది తోడ్పాటు ఇస్తుందని చట్టాల్లో ప్రత్యేక క్లాజులు ఉంచారు.
* చట్టం ప్రకారం జూదం లేదా పందేలు ఆడేందుకు ప్రత్యేకమైన రూమ్, ఏళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఆడిస్తే నేరం అవుతుంది. జూదం ఆడిన వారితో పాటు షెల్టర్ ఇచ్చిన వారు నేరస్థులు అవుతారు.
* డబ్బులు పెట్టి ఎలాంటి ఆటలు ఆడిన నేరమే. ఒకరికి ఒకరు పందెం కాసుకొని ఆడే ఆటలు దీని పరిధిలోకి వస్తాయి. దానికి ఈ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయవచ్చు.
* దీనిలో మొదటిసారి పట్టు బడితే 6 నెలలలోపు జైలు శిక్ష, జరిమానా పడుతుంది. రెండుసారులు, అంతకు మించి దొరికితే 6 నెలల దాటి జైలు శిక్ష, జరిమానాలు ఉంటాయి.
ఎప్పుడు మార్పులు ఏమిటంటే?
జగన్ ఈ చట్టంలో మార్పులను కొత్తగా తీసుకువస్తున్నారు. అందులోను కొన్ని బెట్టింగ్ యాప్లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిషేదించగా, ఆ కంపెనీలు ప్రభుత్వ తీరుపై కోర్టులకు వెళ్లాయి. ఎప్పుడు చట్టంలో సవరణలు చేసి ముందుకు వెళ్తే ఎలాంటి లీగల్ సమస్యలు రావు. దింతో చట్టంలో మార్పులు చేసేందుకు డ్రాఫ్ట్ రెడీ చేసారు .
* ఇప్పటివరకు గేమింగ్ యాక్ట్ ప్రకారం ఒక గదిలో లేదా రహస్య ప్రదేశంలో, కొందరు వ్యక్తులు పోగై
గుంపుగా జూద క్రీడలు ఆడితే నేరం గా పరిగణించేవారు. ఒక్కడే ఆడటం సాధ్యం కాదు కాబట్టి అప్పటి 1974 కు అనుగుణంగా దీన్ని రూపొందించారు.
* ప్రస్తుత సాంకేతిక యుగంలో ఒక్కరే ఇంట్లో నుంచి రమ్మీ, బెట్టింగ్ ఆడుతూ జొడంలో మునిగి తేలుతున్నారు. దింతో ఏది గేమింగ్ యాక్ట్లోకి రావడం లేదు. (దీనిపై సవరణ చేయనున్నారు)
* జూద గృహాలు నిర్వహించేవారు యాక్టులోకి వస్తారు అని ఉంది. అయితే ప్రస్తుతాం ఎలాంటి గృహాలు లేకున్నా ఆన్ లైన్ వేదికగా జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. దింతో తాము ఎలాంటి గృహాలు నిర్వహించడం లేదని ఆన్ లైన్ నిర్వాహకులు తప్పించుకునే వీలుంది (దీన్ని సవరిస్తారు )
* దీనిలో పట్టుబడితే ఇప్పటివరకు కేవలం 6 నెలల శిక్ష మాత్రమే ఉంది. చాల కేసుల్లో పేకాట ఆడితే వారికీ 3 రోజుల శిక్ష వేయడం లేదా జరిమానాతో పంపుతున్నారు. ప్రస్తుత ఆన్ లైన్ గేమ్స్ వాళ్ళ కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎలాంటి తీవ్రత ఉన్నపుడు నిర్వాహకులు, నిందితులపై ఇతర సెక్షన్లు పెట్టేలా, శిక్ష కాలం పెంచేలా సవరణ ఉండొచ్చు.
ఎలాంటివి ఇంకా మరికొన్ని చట్టంలోని కీలక అంశాల ఆధారంగా మార్పులు ఉంటాయి. పాత చింతకాయ పచ్చడిలాంటి చట్టానికి పూర్తిస్థాయి మెరుగులు దిద్ది కొత్తగా చట్టాన్ని మరింత పవర్ ఫుల్ గా తీసుకురాబోతున్నట్లు, ప్రస్తుతం జోరుగా ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ వ్యవస్థను రాష్ట్రంలో నిరోధించేలా ఇది ఉంటుందని ఓ న్యాయవాది ‘‘న్యూస్ ఆర్బిట్” ప్రతినిధికి చెప్పుకొచ్చారు.