Karthika Deepam:ఒక్కసారి లాస్ట్ ఎపిసోడ్ ని రివైండ్ చేసుకుంటే.. రుద్రాణి మనుషుల్ని కార్తీక్ చాలా ధీటుగా ఎదుర్కొంటాడు.
ఆ విషయం రుద్రాణికి తెలిసి ఆశ్చర్య పోతుంది. వాడు అంత ధైర్యం చేశాడా అనే అనుమానం తనకి కలుగుతుంది. ఇక మోనిత తన బాబుని కారులో వదిలి ఓ షాప్ కి వెళ్తుంది. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి వచ్చి కారులో వున్న బాబుని ఎత్తుకుని పోతాడు. ఆ సీన్ కట్ చేస్తే..
Karthika Deepam కార్తీక దీపం: నేటి ఉత్కంఠ భరితమైన ఎపిసోడ్ ని ఇప్పుడే చదివేయండి.. కార్తీక్, రౌడీలు, రగడ చూడాల్సిందే!
రుద్రాణి కార్తీక్ ని కలుసుకొని ఏం చేస్తుంది?
కార్తీక్, పిల్లలు, దీప భోజనానికి నేలపై కూర్చుంటారు. సరిగ్గా అదే సమయంలో ఉగ్ర రూపంలో రుద్రాణి అక్కడికి చేరుకుంటుంది. ఇక రావడం రావడమే ఇళ్లంతా పరికించి చూస్తుంది. అంతా గమనించిన రుద్రాణి “పరిస్థితి చెడి వచ్చాము అన్నారు.. ఇంట్లో సామాన్లు చాలానే ఉన్నాయి!” అంటుంది. దానికి బదులుగా కార్తీక్ “బయట వాళ్ల సామాన్లు కింద పడి ఉన్నాయని నేనే ఇంట్లోకి తీసుకొచ్చాను” అని చెప్తాడు. వెంటనే కోపంతో ఊగిపోతూ రుద్రాణి ‘నోర్ముయ్’ అని కేకలు వేస్తూ.. వాళ్ళు తింటున్న కంచాల ముందున్న అన్నం పళ్ళేన్ని కాలితో ఓ తన్ను తన్నుతుంది.
‘కార్తీకదీపం’ కి ఈ క్రేజ్ ఏంటి బాబోయ్..! ప్రాణం మీదకి వచ్చినా సీరియల్ గొడవే వీళ్ళకి
దీపకి కోపమొచ్చి ఏం చేసిందంటే!
రుద్రాణి తన్నిన తన్నుకి అందరూ ఆశ్చర్య పోతారు. రుద్రాణి వారితో “రుద్రాణి సామ్రాజ్యం రా ఇది” నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారా అనేట్టుగా వారి వైపు చూస్తుంది. ఇంతలో కార్తీక్.. “ఏం చేసారో అర్ధం అవుతుందా? తింటున్న అన్నాన్ని కాలితో తంతారా?” అంటూ రుద్రాణిని ప్రశ్నిస్తాడు. దాంతో ఆవేశంతో రుద్రాణి కార్తీక్ గుండెలపై చెయ్యి వేసి వెనక్కి నెట్టేస్తుంది. ఇక దాంతో చిర్రెత్తిన దీప వెంటనే మరేమీ ఆలోచించకుండా ‘ఏం చేస్తున్నావే’ అంటూ కోపంతో రుద్రాణి చెంపను పగలకొడుతుంది. దాంతో పిల్లలు, కార్తీక్ షాక్ అయిపోతారు. తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం…