Karthikadeepam October 13 today episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1481ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 13న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్లో ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. గత ఎపిసోడ్ లో కార్తీక్ ను రాజ్యలక్ష్మి, వారణాసి ఇద్దరు కలిసి దీప గురించి చెప్పడంతో కార్తీక్ లో ఆలోచన మొదలవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..చంద్రమ్మ సౌర్య దగ్గరకి వచ్చి మీ అమ్మలాగా కనిపించే ఆవిడను వెతికానమ్మ ఎక్కడ కనిపించలేదు అని అంటుంది. అప్పుడు ఇంద్రుడు, నాకు దొరికారు అని అనగా, మరి కలిసారా?తను మీ అమ్మేనా? అని అడగగా మా అమ్మ కాదు అని శౌర్య చెప్తుంది. ఇప్పుడు మనకి ఇంకేం ఆశలు లేవు అని చంద్రమ్మ అనగా, లేదు పిన్ని అమ్మ నాన్నలు బతికే ఉన్నారని నాకు నిజం తెలిసింది అని మోనిత గురించి చెబుతుంది.నేను మోనిత ఆంటీ దగ్గరికి వెళ్ళాలి మోనిత ఆంటీ లెక్క తీర్చే తిరిగి వెళ్దాము. ఇంటికి వెళ్లిన తర్వాత ఇంకో కొత్త లెక్క మొదలు పెట్టాలి.ఎప్పుడైతే అమ్మ నాన్నలు చనిపోయారు అని అబద్ధం చెప్పిందో అప్పుడే నాకు శత్రువు అయిపోయింది అంటుంది సౌర్య.
కార్తీక్ ను కలిసిన వారణాసి :
సీన్ కట్ చేస్తే వారణాసి, కార్తీక్ గతం మర్చిపోయాడు అని గత జ్ఞాపకాలని గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు కార్తిక్ కి అస్పష్టమైన గతం గుర్తొస్తుంది.అప్పుడు బాధపడుతూ, నువ్వు చెప్పినవన్నీ చూస్తే దీపే నా భార్య అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా దీపే నా భార్య అయితే నేను చేయకూడని తప్పు చేశాను అని అంటాడు. దానికి వారణాసి దీపక్క బతికే ఉందా? ఎక్కడ ఉంది? అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్, నా చుట్టూనే ఉన్నది నేనే తన భర్తని అని చెప్తూనే ఉంది. కానీ నేనే ఎప్పుడు వినలేదు అని అనగా, ఇంత పని చేశారేంటి డాక్టర్ బాబు పదేళ్ల నుంచి చేయని తప్పుకు నింద మోస్తుంది.ఇప్పుడు మళ్ళీ అక్కని అవమానించారు అని అంటాడు.దానికి కార్తీక్, చాలా పెద్ద తప్పు చేశాను అని నన్ను ఒక్కడినే వదిలే నాకేం మాట్లాడాలో తెలియడం లేదు వెళ్లిపో అని అరవడంతో వారణాసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
దీపను చంపడానికి వచ్చిన రౌడీలు :
మరోవైపు దీప కార్తీక్ కోసం సందు చివరికి వచ్చి వెతుకుతూ ఉంటుంది.అదే సమయంలో వెనక నుంచి రౌడీలు దీపను చంపేద్దామని చూస్తారు. అప్పుడే వారణాసి అక్కడికి వచ్చి దీపను చూసి పిలిచే రౌడీలు వారణాసిపై దాడి చేస్తారు.వాళ్ళు ముగ్గురు వారణాసిని కొడుతున్నప్పుడు కార్తీక్ అక్కడికి వచ్చి వారణాసికి సహాయం చేసి రౌడీలను అక్కడ నుంచి తరిమి కొడతారు.వారణాసి మాత్రం స్పృహ కోల్పోయి దెబ్బలతో కింద పడుంటాడు.
మోనితపై సౌర్య పగ :
మరోవైపు శౌర్య మోనితను వెతుక్కుంటూ వెళ్తుంది.మోనిత కనిపించిన వెంటనే శౌర్య రాయి తీసుకుని మోనితను కొట్టాలని చూస్తుంది. సౌర్య రాయి తీయడం చూసిన మోనిత పక్కకు తప్పుకోవడంతో ఆ రాయి మోనితకు తగలకుండా వీధి చివర ఉన్న కార్తీక్ కి తగులుతుంది.శౌర్య మోనితకు తగల్లేదు అని అక్కడ నుంచి పారిపోతుంది.కార్తిక్ కి రాయి తగిలిన వెంటనే కార్తీక్ కి అస్పష్టమైన గతం గుర్తొస్తూ జరిగిన విషయాలు అన్ని గుర్తుకు వస్తాయి ఇంతలో స్పృహ తప్పిన వారణాసిని లేపడానికి ప్రయత్నిస్తాడు.
కార్తీక్ కనిపించకపోవడంతో టెన్షన్ పడుతున్న మోనిత :
మరోవైపు శౌర్య అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ ఆటో దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెబుతుంది.ఎలాగో ఇక్కడ జాతర అయిపోయింది కదా వెళ్ళిపోదాము అని ఇంద్రుడు అంటాడు. అప్పుడు ముగ్గురు ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. మరోవైపు మోనిత,కావేరి దగ్గరకు వచ్చి కార్తీక్ కనిపించడం లేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.పదేళ్లుగా నేను కార్తీక్ కోసం ఏ అవకాశాలు లేక ఎదురు చూస్తూనే ఉన్నాను ఇప్పుడు బంగారు లాంటి అవకాశం దొరికింది అనుకుంటే ఇప్పుడు ఆ వంటలక్క వచ్చి మధ్యలో పెంట పెట్టింది అని అంటుంది. దానికి కావేరి, అయినా మీరు ఇక్కడున్నట్టు తనకి ఎలా తెలుసు అని అడగగా, ఏమో కావేరి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది అంటుంది. దానికి తగ్గట్టు దాని వెంటే ఆ దుర్గ గాడు, మధ్యలో ఆ శౌర్య ఒకరి తరువాత ఒకరు వస్తూనే ఉన్నారు అంటుంది. ఇప్పుడేమో కార్తీక్ మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు అని అంటుంది.
డాక్టర్ బాబు కోసం దీప ఆందోళన:
మరోవైపు దీప కార్తీక్ కోసం జాతర అంతా వెతికి తిరిగి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి డాక్టర్ బాబు కనిపించడం లేదు. మోనిత చాలా ధీమాగా ఉన్నది ఆ సందు చివర ఉన్నారని చెప్పింది తీరా అక్కడికి వెళ్తే డాక్టర్ బాబు కనిపించలేదు తిరిగి వచ్చి చూసేసరికి మోనిత కూడా లేదు నన్ను పక్కదారి మళ్ళించి వాళ్ళు వెళ్లిపోయినట్టున్నారు అంటుంది. మళ్ళీ తిరిగి రారేమో అని బాధపడుతూ ఉంటుంది. దానికి దీప వాళ్ళ అన్నయ్య దీపకు సర్ది చెబుతాడు.
సౌర్య కొట్టిన దెబ్బకు కార్తీక్ కు గుర్తొచ్చిన గతం :
సీన్ కట్ చేస్తే వారణాసికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంతలో కార్తీక్ కి తల పైన కట్టు కట్టిన డాక్టర్ ఏ ప్రాబ్లం లేదండి బానే ఉన్నది అని అంటాడు.పక్కనున్న నర్స్ కార్తీక్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ ఉండగా తను కూడా డాక్టరు అని వాళ్లకు తెలుస్తుంది. మీరు డాక్టర్ ఆ? అని కార్తీక్ ని అడగంగా, అవును హైదరాబాదులో కార్డియాలజిస్ట్ అని కార్తీక్ అంటాడు. కార్తీక్ డాక్టర్ని వారణాసి స్థితి ఎలా ఉన్నది అని అడగగా తలకు దెబ్బ తగిలింది కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది అని చెప్పటంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో దీప కార్తీక్ కోసం ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ బాబు ఎక్కడున్నా నేను వెతికి తీసుకొచ్చుకుంటాను అని బయటికి రాగానే ఎదురుగా కార్తీక్ నిలబడి ఉండటంతో డాక్టర్ బాబు అంటూ ఏడుస్తూ వెళ్లి కార్తీక్ ని కౌగిలించుకుంటుంది