నాని, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందిన ‘జెర్సీ’ చాలా పెద్ద సక్సెస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంగీతం, నేపథ్య సంగీతం అందించింది అనిరుద్ రవిచంద్రన్. ఈయనే గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’కి కూడా సంగీతాన్ని అందించారు. అజ్ఞాతవాసి తర్వాత అనిరుద్ను త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ నుండి తప్పించాడు. అందుకు ఆయన కారణాలు ఆయనకున్నాయి. అయితే ఆ విషయంలో అనిరుద్ హార్ట్ అయ్యాడేమో కానీ.. ఇప్పుడు జెర్సీ సక్సెస్కు వస్తోన్న రెస్పాన్స్తో ట్విట్టర్లో గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. ‘జెర్సీపై అద్భుతమైన కామెంట్స్, రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా సంగీతం అందరి మెప్పు పొందుతుంది. ఇది నిజంగా ఆనందమే. హీరో నాని, డైరెక్టర్ గౌతమ్ సహా యూనిట్కు కృతజ్ఞతలు’ అనే మెసేజ్ పోస్ట్ చేశాడు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే మెసేజ్ క్రింద అనిరుద్ పోస్ట్ చేసిన వీడియో చూస్తే.. ఆయన ఎవరినో టార్గెట్ చేసినట్టు కననపడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకు అంతా ఆంతలా ఆ వీడియోలో ఏముందో తెలుసా! ‘పేట’ సినిమాలోని రజనీకాంత్ డైలాగ్. ‘నా పనైపోయిందనుకున్నావా హ హ హ’ అనే డైలాగ్ అందులో ఉంది. ఈ ట్వీట్, వీడియో చూసినవారు త్రివిక్రమ్ను దృష్టిలో పెట్టుకునే అనిరుద్ ట్వీట్ చేశాడని అంటున్నారు.