Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. 2021లో “అఖండ” 2023 స్టార్టింగ్ లో “వీరసింహారెడ్డి” రెండు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకోవటం జరిగింది. ఈ రెండు సినిమాలు బాలయ్య కెరియర్ లో అత్యధిక హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించాయి. “అఖండ” సినిమా రాకముందు వరుస పరాజయాలతో కెరియర్ పరంగా బాలయ్య అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. కానీ తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకున్న బాలయ్య ఇప్పుడు తన రెమ్యూనరేషన్ పెంచేయటం జరిగింది అంట.
ప్రస్తుతం బాలయ్య గతంలో కంటే ₹20 కోట్లు రూపాయలు పారితోషకం కింద తీసుకుంటున్నట్లు ఫిలింనగర్ టాక్. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి ఇదే రెమ్యూనరేషన్ అనీ సమాచారం. వాస్తవానికి బాలకృష్ణ సినిమాల విషయంలో పెద్దగా రెమ్యూనరేషన్ గురించి డిస్కషన్ జరగదు. సరిగ్గా పాత్ర నచ్చితే బాలయ్య దూసుకుపోతారు. కనీటి ఇవాళ బాలయ్య తన రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచేయడం జరిగిందట. దేశంలోనే కాదు ఓవర్సీస్ వంటి చోట్ల కూడా బాలకృష్ణ సినిమాలు ₹70 కోట్ల మేర థియేట్రీకల్ బిజినెస్ చేస్తూ ఉండటంతో పాటు ఓటిటి, టీవీ, డిజిటల్ హక్కుల విషయంలో కూడా భారీగా ధర పలుకుతూ ఉండటంతో.. బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుందట. ప్రస్తుతం తారకరత్న అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉండటంతో బాలకృష్ణ అక్కడే ఉంటూ ఉన్నారు. తారకరత్న కోలుకున్నాక అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నారట. ప్రస్తుతానికి మాత్రం పూర్తిగా హాస్పిటల్ వద్దే గడుపుతున్నారు. అనిల్ రావిపూడి సినిమాలో చాలా వైవిధ్యమైన పాత్రలో బాలయ్య కనిపించనున్నారట. పూర్తిగా తెలంగాణ నేపథ్యం కలిగిన యాసలో బాలకృష్ణ డైలాగులు ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో కనిపిస్తూ ఉంది అని ఇండస్ట్రీ టాక్.