Prabhas: “బాహుబలి” వంటి బ్లాక్ బస్టర్ విజయం ప్రభాస్ క్రేజ్ రూపురేఖలను మార్చేసింది. ఈ బొమ్మ పడక ముందు కేవలం ప్రభాస్ టాలీవుడ్ కే పరిమితం అన్న తరహాలో మార్కెట్ వుండేది. కానీ ఎప్పుడైతే రాజమౌళి చేతిలో “బాహుబలి” గా చెక్క పడ్డాడో… ఒక్కసారిగా ప్రభాస్ క్రేజ్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఊహించని పాపులారిటీ వచ్చినా గానీ ప్రభాస్ సినిమాలు చేయడంలో మరియు చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్డేట్ ఇవ్వటంలో చాలా బద్ధకంగా ఉంటారని చాలామంది అంటారు. ఒక్కో సినిమా కంప్లీట్ చేయడానికి డార్లింగ్ చాలా టైం తీసుకుంటారని కూడా చెబుతారు. అంతెందుకు “సాహో” సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఒప్పుకున్న “రాధేశ్యాం” సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అనేది చాలా నెలలు ఎవరికి తెలియని పరిస్థితి.
ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ పెద్దగా యాక్టివిటీ గా ఉండరు. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ నటించిన “రాధేశ్యాం” సినిమా ఈ నెల 11 వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న ప్రభాస్ సోషల్ మీడియా కి సంబంధించి చేసిన కామెంట్లు అభిమానులను నిరుత్సాహంలో పడేశాయి. విషయంలోకి వెళితే ఇంటర్వ్యూ లో భాగంగా… యాంకర్ సోషల్ మీడియా కి మీరు ఎందుకు చాలా దూరంగా ఉంటారు అని ప్రశ్నించటం జరిగింది. దానికి ప్రభాస్ సమాధానమిస్తూ రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో ఇంకా తక్కువగా యాక్టివిటీ తగ్గించాలని అనుకుంటున్నాను.
పూర్తిగా సినిమాలపై టైం కేటాయించి ఏడాదికి మూడు సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఇక ఇదే సమయంలో ఆన్లైన్ లో.. అదేవిధంగా ఆఫ్ లైన్ లో.. తక్కువగా స్పందించన్నప్పటికీ… అభిమానులు ఇంతగా ప్రేమిస్తున్నందుకు హృదయపూర్వక… హృదయపూర్వక ధన్యవాదాలు అనే ప్రభాస్ తెలియజేయడం జరిగింది. ఏదిఏమైనా సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తానని.. డార్లింగ్ మాట ఇవ్వటం సంతోషంగానే ఉన్నా గాని సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని ప్రభాస్ చెప్పటం పట్ల అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు.
Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!