ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాల్లో హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సినిమాల్లో పవన్ కల్యాణ్ సినిమా ఒకటి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఆ సినిమానే ‘వకీల్ సాబ్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, బిజినెస్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ ను తెర మీద చూసి రెండేళ్లు కావడంతో అభిమానులంతా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కేవలం సినిమా టైటిల్ తో మోషన్ పిక్ రిలీజ్ చేసినందుకే పవన్ ఫ్యాన్స్ చేసిన హడావిడి సామాన్యమైంది కాదు. రెండు రాష్ట్రాల్లో కూడా భీభత్సం చేసేశారు. ఇక రిలీజే తరువాయి అనుకున్న తరుణంలో కరోనా వచ్చి వారి ఆశలను చిదిమేసింది.
దీంతో మే 15న విడుదల కావాల్సిన వకీల్ సాబ్ ఇంకా షూటింగ్ దశలో ఆగిపోయింది. మొన్న పవన్ బర్త్ డేకి మోషన్ టీజర్ రిలీజ్ కావడంతో కొద్దిగా సంబరాల్లో మునిగిపోయారు. ఇలా వకీల్ సాబ్ గురించి ఏ న్యూస్ వచ్చినా వారి ఆనందానికి అవధులు ఉండటం లేదు. ఇప్పుడు వారి ఆనందాన్ని రెట్టింపు చేసే కొన్ని విషయాలు దర్శకుడు వేణు శ్రీరామ్ ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. సినిమాలో పవన్ ఎంట్రీ అరగంట తర్వాతే ఉంటుందట. సినిమాను కమర్షియల్ గా కాకుండా కథలో ఉన్న ఇంటెన్సిటీ దెబ్బ తినకుండా తీస్తున్నామన్నాడు. పవన్ క్యారెక్టర్ అభిమానులకు విపరీతంగా నచ్చుతుందని అంటున్నాడు.
కమర్షియల్ సినిమా కాకపోయినా ఇందులో అయిదు పాటలు ఉంటాయని అంటున్నాడు. సినిమా మహిళలు అందరూ గర్వంగా చెప్పుకునే ఉంటుందని చెప్పుకొచ్చాడు. కథలో మనకు తగ్గట్టు కొన్ని మార్పులు చేశాం కానీ.. కథలో మెయిన్ థీమ్ మాత్రం మిస్సవదని అంటున్నాడు. పవన్ తో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ లో షూటింగ్ తిరిగి మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ అఫిషియల్ న్యూస్ ఇవ్వాల్సి ఉంది. సినిమా ఓటీటీల్లో కాకుండా ధియేటర్లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.