విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన సినిమా `మీకు మాత్రమే చెప్తా`. సమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ను పొందింది. సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, సెన్సార్ సభ్యులు నుండి మంచి రెస్సాన్స్ వచ్చింది. సినిమా నిర్మాణంలో అడుగు పెట్టిన మాకు మొదటి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ చాలా స్పెషల్ గా నిలుస్తుంది. కొత్త తరహా ఆలోచనలను ప్రొత్సహించేందుకు కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్ టైన్మెంట్ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం మాకు ఉంది. ఫన్ ఎంటర్ టైనర్లా సినిమా అందరినీ మెప్పిస్తుంది. ’ అన్నారు.