Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 8 చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది. తెలంగాణలో పెద్దగా క్యాడర్ లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నీ పోటీ చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వంద రోజులలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. రకరకాల యాత్రలు సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు.
రాజకీయంగా పవన్ షెడ్యూల్ అలా ఉంటే మరో పక్క సినిమాల పరంగా కూడా.. షూటింగ్లను కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో..”ఉస్తాద్ భగత్ సింగ్” చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది. మరొకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు”.. అదే విధంగా సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న “ఓజి”.. సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. కాగా ఈ సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న పవన్ మరో సినిమా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల డైరెక్టర్ మెహర్ రమేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ వార్త రాగానే పవన్ ఫ్యాన్స్ భయపడిపోతున్నారు.
దయచేసి మెహర్ రమేష్ తో సినిమా చేయొద్దు అని పవన్ కళ్యాణ్ కి సూచనలు చేస్తున్నారు. సరైన హిట్టు లేక చాలా కాలం గ్యాప్ తీసుకుని ఇటీవలే చిరంజీవితో “భోళా శంకర్” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో మెహర్ రమేష్ ప్రాజెక్టు ఒప్పుకోవద్దని పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్ల రూపంలో రిక్వెస్ట్ లు చేస్తున్నారు. పవన్ ఇటీవల వరుస విజయాలతో ఓ మాదిరి హిట్లు అందుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మెహర్ రమేష్ లాంటి దర్శకులతో సినిమాలు చేయడం ప్రమాదకరమని అంటున్నారు.