డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నా థ్ దర్శకత్వంలో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా వస్తూ ఉండటంతో ఇండస్ట్రీ మొత్తం ఆసక్తికరంగా “లైగర్” రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంది. రేపే సినిమా విడుదల కానున్న నేపథ్యంలో… విజయ్ దేవరకొండ అభిమానులు సైతం టెన్షన్ పడుతూ ఉన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫుల్ ఫ్లాపుల్లో ఉన్నాడు. “లైగర్” తో హిట్ కొట్టడానికి సినిమా కోసం చాలా కష్టపడటం జరిగింది. ఇంక ఒక్క రోజే విడుదలకు టైం ఉండటంతో తాజాగా “లైగర్” టీం యాంకర్ సుమకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
ఇంటర్వ్యూలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ “లైగర్” స్టోరీ చిన్న లైన్ గా చెప్పేశారు. కరీంనగర్ నుండి ఒక కుర్రాడు అతను తల్లి.. ముంబై కి వస్తారు. ఆ తల్లి కోరిక తన కొడుకు నేషనల్ ఛాంపియన్ గా చూడాలని అనుకుంటుంది. ఆ కుర్రోడు నేషనల్ ఏంటి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిపోతాడు. అయితే ఆ స్థాయి దాకా ఎలా కష్టపడి వెళ్ళాడు మధ్యలో ప్రేమ కథ.. ఇక ఇదే సందర్భంలో మైక్ టైసన్ ఎందుకు వచ్చాడు.. అనేది సినిమా స్టోరీ. చెప్పటానికి చిన్నగా ఉన్నాగాని.. బలమైన నేపథ్యం కలిగిన సినిమా. చెప్పడానికి ఈజీగా ఉన్నాగాని అందులో పాత్రలు చాలా కష్టతరంగా ఉంటాయి.
విజయ్ అదే విధంగా అనన్య పాండే రమ్యకృష్ణ ఏ పాత్రకి ప్రాధాన్యత ఆ రీతిలో ఉంటుంది చాలా బిగ్ స్కేల్ సినిమా “లైగర్” అని తనదైన శైలిలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్టోరీ చెప్పడం జరిగింది. ఇదే స్టోరీ లైన్ నీ వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ కూడా చెప్పడం జరిగింది. కానీ తాజాగా సుమ ఇంటర్వ్యూలో మరింత లోతుగా పూరి చెప్పటంతో.. సినిమాపై మరింత ఇంట్రెస్ట్ నెలకొంది.