వరుస పరాజయాల తర్వాత ఈ ఏడాది విడుదలైన `చిత్రలహరి`తో సక్సెస్ సాధించాడు హీరో సాయితేజ్. త్వరలోనే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా.. దీంతో పాటు `ప్రస్థానం`, `ఆటోనగర్ సూర్య` వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు దేవాకట్టాతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం దేవాకట్టా `బాహుబలి` ప్రీక్వెల్గా రూపొందుతున్న వెబ్ సిరీస్ `శివగామి` చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ముగియనుంది. దాని తర్వాత సాయితేజ్తో ఓ సోషల్ డ్రామాను తెరకెక్కించేబోతున్నాడట దేవాకట్టా. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
previous post
next post