Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో మళయాళ రీమేక్ లూసిఫర్ కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం కరోనా కారణాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. లేదంటే.. ఈసరికే సినిమా షూటింగ్ ప్రారంభమై ఉండేది. ప్రస్తుతం సినిమాలో కీలకమైన పాత్రల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో సినిమాపై ఓ వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఈ పాత్ర కోసం ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న నటిని సంప్రదించినట్టు తెలుస్తోంది.
ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ ను లూసిఫర్ లో నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు కథ కూడా వివరించినట్టు తెలుస్తోంది. సినిమాలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టీటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈపాత్ర కోసం గతంలో పలువురు నటీమణుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు విద్యాబాలన్ పేరు వినిపిస్తోంది. అయితే.. ఈ వార్త నిజమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. డర్టీ పిక్చర్ ద్వారా విద్యాబాలన్ దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడులో బసవతారకం పాత్రలో ఆమె నటించారు. దక్షిణాదిలో ఆమె పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
Read More:Chiranjeevi Oxygen Banks: తెలుగు మీడియాకు చిరంజీవి సాయం కనిపించదా..? సోనూ మాత్రమేనా..?
లూసిఫర్ లో ఆమె నటించేది నిజమే అయితే.. సినిమాకు మరో అదనపు ఆకర్షణ వచ్చినట్టే. ఈ సినిమా టైటిల్ గా ‘కింగ్ మేకర్’ అనే నిర్ణయించారని తెలుస్తోంది. ఈ టైటిల పట్ల చిరంజీవి ఆసక్తి చూపారని అంటున్నారు. సినిమాలో మరో కీలకపాత్ర కోసం సత్యదేవ్, వరుణ్ తేజ్ పేర్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్ కూడా ఫైనల్ కావాల్సి ఉంది. ఈ వార్తలన్నింటిలో నిజమెంతుందో తెలియాలంటే టీమ్ నుంచి అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సిందే. రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!