Salaar: ప్రభాస్ “సలార్” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులకి తెగ నచ్చేసింది. “బాహుబలి” తర్వాత ఆ రేంజ్ ఎనర్జీ కలిగిన సినిమాగా “సలార్” నిలిచింది. మాస్ పాత్రలో ఫుల్ ఎనర్జీ కలిగిన పాత్రలో ప్రభాస్ బాడీ డైలాగులు థియేటర్ లో ప్రేక్షకులను దద్దరిలేటట్టు చేశాయి. దీంతో “సలార్” సినిమా విజయానికి.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. డిసెంబర్ 22వ తారీకు ఐదు భాషలలో పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం వారం రోజులు గడవక ముందే 500 కోట్ల క్లబ్ లో జాయిన్ కావడం జరిగింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చినట్లు.. బాక్సాఫీస్ రికార్డులను దేవా రిపేర్ చేస్తున్నట్లు క్యాప్షన్ పెట్టడం జరిగింది. ఈ సినిమా 2023 ఏడాదిలో వచ్చిన అన్ని సినిమాల్లో కంటే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. తెలుగులో నైజాంలో అనేక రికార్డుల క్రియేట్ చేస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటినట్లు వార్తలు రావడం జరిగింది. బాహుబలి 2, RRR తర్వాత అత్యధిక కలెక్షన్స్ “సలార్” పేరిట నైజాం ప్రాంతంలో రికార్డు క్రియేట్ అయింది. బాహుబలి 2 తరువాత ఐదు సంవత్సరాలు సరైన విజయాలు లేక ప్రభాస్ సతమతమయ్యారు. ఆయన నటించిన సాహూ, రాధేశ్యాం, ఆదిపురుష్ మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
ఈ క్రమంలో “సలార్” విజయం సాధించటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదే సమయంలో రెండో పార్ట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం చాలా అద్భుతంగా ఉంటుందని ఇటీవల హాలీవుడ్ ఇండస్ట్రీ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలియజేశారు. మొదటి భాగంలో ప్రాణ స్నేహితులుగా కనిపించిన పృద్వి సుకుమారన్ ప్రభాస్ రెండో భాగంలో.. శత్రువులుగా కనిపించబోతున్నారు. దీంతో ఫస్ట్ పార్ట్ లో చాలా ట్వీస్టులు ఉండటంతో రెండో పార్ట్ పై అంచనాలు ఉన్నా కొద్ది పెరుగుతూ ఉన్నాయి.