సుకుమార్ అల్లు అర్జున్ ల కాంబోలో తయారవుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే 5 భాషలకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసిన బృందం పాన్ ఇండియా కేటగిరిలో రూపుందుతుందన్న క్లారిటీని ఇచ్చారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కే పుష్ప ఇప్పటికే ఒక షెడ్యూన్ ని పూర్తి చేసుకుంది. ఆ తర్వాత షెడ్యూల్ ని కేరళ లోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేశాడట సుకుమార్. ఈ షెడ్యూల్ భారీ స్థాయిలో ప్లాన్ చేశారట. అంతేకాదు ఎక్కువ రోజులు ఇక్కడే చిత్రీకరణ జరపాలనుకున్నారు. కాని కరోనాతో మొత్తం ప్లాన్స్ తారుమారయ్యాయి. అంతేకాదు 3 కోట్ల వరకు నష్టం కూడా జరిగిందని సమాచారం.
అయితే ఇటీవల ప్రభూత్వం షూటింగ్స్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పుష్ప సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని సుకుమార్ సిద్దమవుతున్నాడట. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవుట్ డోర్ లో షూటింగ్ జరిపే వీలు లేదన్న కారణంగా సెట్స్ వేసి చిత్రీకరణ చేసేందుకు రెడీ అయ్యారట. ఇన్ డోర్ లో చేసే సీన్స్ ని ముందు తీస్తారట. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.