SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దసరా పండుగకు ముందు స్టార్ట్ అయిన మొదటి షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో మలయాళ బ్యూటీనీ తీసుకోవటానికి దర్శకుడు త్రివిక్రమ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పూర్తి విషయంలోకి వెళ్తే సినిమాలో నెగిటివ్ రోల్ లో “పోన్నియన్ సెల్వన్”లో నటించిన ఐశ్వర్య లక్ష్మి ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్.. ఐశ్వర్య లక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహితో స్టెప్పులు వేయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు… ఏకధాటిగా షూటింగ్ స్టార్ట్ చేసి చెప్పిన తేదీ ఏప్రిల్ 28వ తారీకు వేసవి సందర్భంగా ఈ సినిమా విడుదల చేయనున్నట్లు సమాచారం.
మహేష్ కెరియర్ లో.. “అతడు” మరియు “ఖలేజా” నటన పరంగా చాలా వైవిధ్యమైన సినిమాలు. ఈ రెండు సినిమాలలో దర్శకుడు త్రివిక్రమ్.. మహేష్ లో ఉన్న కొత్త నటన బయటకు తీయడం జరిగింది. “ఖలేజా” ద్వారా మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ అద్భుతంగా చూపించాడు. మరి రాబోతున్న ఈ మూడో సినిమాలో మహేష్ నీ త్రివిక్రమ్ ఏ విధంగా చూపిస్తాడు అన్నది అభిమానులలో ఆసక్తికరంగా మారింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!