గత ఏడాది నవంబర్ నెలలో చైనా దేశంలో వ్యూహన్ పట్టణంలో బయటపడిన కరోనా వైరస్ ఒక్క ఏడాదిలోనే ప్రపంచం మొత్తం పాకిపోయింది. చాలా మంది ఈ వైరస్ దెబ్బకి మరణించడం జరిగింది. ముఖ్యంగా యూరప్ దేశాలు వైరస్ దాటికి చాలా నష్ట పోయాయి అని చెప్పవచ్చు. ఆర్ధికంగా ప్రాణ నష్టం పరంగా చాలా దేశాలు ఈ వైరస్ వల్ల నష్టపోవడం జరిగాయి.
ఇదిలా ఉండగా ఈ వైరస్ కి సంబంధించి మొట్టమొదటి వ్యాక్సిన్ రష్యా దేశం కనుగొన్న సంగతి తెలిసిందే. రష్యా దేశం కనుగొన్న తర్వాత చాలా దేశాల ప్రయోగాలు సక్సెస్ అవుతూ వ్యాక్సిన్లు వస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. కాగా త్వరలో మన దేశంలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది.
అయితే చాలావరకు తొలిదశలో వ్యాక్సిన్ ముందుగా కరోనా వారియర్స్కు ఇవ్వనున్నారట. ఆ తర్వాత వయసు పరంగా ఇస్తారట. ఇదిలా ఉండగా రష్యా దేశం అందించే కరోనా వ్యాక్సిన్ డోజ్ ఈ విషయంలో మందుబాబులకు రష్యా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రష్యా అందుబాటులోకి తెచ్చిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రభావం 42 రోజులు ఉంటుందని రష్యన్లు అప్పటి వరకు ఎలాంటి మద్యపానం సేవించుట కూడదని జాగ్రత్తలు పాటించాలని తాజాగా రష్యా ఉప ప్రధాని టటియానా గోలికోవా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాదాపు రెండు నెలలపాటు మద్యపానానికి దూరంగా ఉండాలని రష్యా అధికారులు చెబుతున్నారు.