జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసులపై మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై అధికార గర్వంతో దాడులకు తెగబడుతున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేసు పెట్టిన బాధితుల పైనే వేధింపులకి పాల్పడటం దారుణమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా ఇంటిపై ఓ యువకుడు దాడికి తెగబడటం అమానుషం అన్నారు.
ఇంటి దగ్గర ఉన్న వాహనాన్ని ధ్వంసం చేస్తే పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. అంతేకాకుండా బాధితురాలైన వినుత ఫ్యామిలీ పై ఎదురు కేసు పెట్టడం ఏంటి అంటూ పోలీసులను నిలదీశారు. దీన్నిబట్టి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లు వాళ్ళ పై ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటూ పేర్కొన్నారు.
చట్టం ఎలా చెబితే అలా వ్యవహరించిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీ వైసీపీ నేతలు చెప్పిన విధంగా విధులు నిర్వహిస్తూ ఇక పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా బాధితులకు ఎలాంటి న్యాయం దొరుకుతుంది అంటూ పవన్కళ్యాణ్ మండిపడ్డారు. జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా ఇంటిపై కుటుంబం పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదిలావుండగా ఈమెపై గతంలోనే అనేక మార్లు మూడుసార్లు అధికార పార్టీకి చెందిన వాళ్లు దాడికి పాల్పడిన విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినా గానీ ఆయన నుండి పెద్దగా స్పందన రాలేదు అంట. ముందుగానే పవన్కళ్యాణ్ స్పందించి ఉంటే, వేరేలా ఉండేది అని జనసేన పార్టీలో వినబడుతున్న టాక్.