Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు తిరుపతి ఉప ఎన్నికలు జరిగిన తర్వాత కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. హైదరాబాదులో ఉన్న పవన్ ఇటీవల ఏపీ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదట విజయవాడలో ఆ తర్వాత మంగళగిరి పార్టీ ప్రధాన కేంద్ర కార్యాలయంలో నాయకులతో ప్రజలతో అదే రీతిలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన పవన్ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై అదేవిధంగా ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించారు.
ముఖ్యంగా అత్యాచారాలు అదేరీతిలో అక్రమంగా ప్రభుత్వ భవనాలు కూల్చేస్తున్నట్లు.. పవన్ ప్రభుత్వం పై సీరియస్ అయ్యారు. అదే రీతిలో పవన్ కళ్యాణ్ కరోనా సమయంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు చేసిన అనేక సహాయ సహకార కార్యక్రమాలపై తనదైన శైలిలో స్పందించి.. కార్యకర్తలని కొనియాడారు.
Read more: Pawan Kalyan: పవన్ చేసిన పని మోడీని గుర్తు చేసిందట.
కష్టకాలములో ప్రజలకు అండగా కార్యకర్తలు ఉండటం నిజంగా సంతోషించదగ్గ విషయం అని.. అభినందిస్తూ తన పర్సనల్ అమౌంట్ నుండి దాదాపు ఒక కోటి రూపాయల చెక్కును.. జనసేన పార్టీ కార్యకర్తలు లైఫ్ ఇన్సూరెన్స్ కి డొనేట్ చేయటం జరిగింది. ఇక ఇదే సమయంలో.. ప్రకటించిన జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా.. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. రాబోయే రోజుల్లో ప్రణాళికబద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల విషయంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా.. వారి తరపున పోరాటం చేయడానికి రెడీ అవుతున్నట్లు స్పష్టం చేశారు.