Janasena: జనసేన పార్టీకి ఆ పార్టీ కీలక నేత బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీకి నియోజకవర్గ ఇన్ చార్జి పదవికి కీలక నేత పోతిన మహేష్ రాజీనామా చేశారు. దీంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేనకు బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ పంపారు.
ఇప్పటి వరకూ పార్టీలో నాకు ఉన్న పదవి బాధ్యతలకు, మరియు క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకూ తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు మరియు పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ సీటును ఆశించారు. గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు అభ్యర్ధిగా ప్రచారం చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో ఆ పార్టీ సుజనా చౌదరిని అభ్యర్ధిగా ప్రకటించింది.
దీంతో పోతిన మహేష్ అసంతృప్తికి గురైయ్యారు. పార్టీ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని, జనసేనకే టిక్కెట్ ఇవ్వాలని పోతిన మహేష్ అనుచరులు కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. అయితే జనసేన అధిష్టానం నుండి ఎటువంటి హామీ లభించకపోవడంతో పోతిన మహేష్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
Delhi Liquor Scam: కోర్టులో కవితకు లభించని ఊరట