AP Ploitical Breaking: 2019 ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టార్గెట్ చేసిన వారిలో అప్పటి అధికార పార్టీ టీడీపీ నాయకుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. చాలా సందర్భాలలో చింతమనేని ని టార్గెట్ చేసుకుని మరీ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఒక ఆకు రౌడీ, వీధి రౌడీ.. చింతమనేని అంటూ పవన్ అప్పట్లో భారీ డైలాగులు వేశారు. ఇదే తరుణంలో చింతమనేని ప్రభాకర్ కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ కి కౌంటర్ లు వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే దెందులూరులో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ .. చింతమనేని ప్రభాకర్ ఇద్దరు కూడా ఓడిపోవడం తెలిసిందే.
ఈ పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్.. మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో ఓడిపోయిన చింతమనేని ప్రభాకర్ కూడా ప్రభుత్వం పై పోరాటాలు చేస్తూనే మరోపక్క అనేక పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో చింతమనేని ప్రభాకర్ తాజాగా ఓ ప్రైవేటు సోషల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ టీడీపీ లోకి…??
విషయంలోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి చింతమనేని సమాధానం చెబుతూ ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు, వాళ్ళ తాత మాదిరిగా ప్రజా సేవ చేయాలని అనుకుంటే కచ్చితంగా వస్తారు అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో యాంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ టిడిపి తో కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అని చింతమనేని నీ ప్రశ్నించారు. దానికి చింతమనేని సమాధానం చెబుతూ కచ్చితంగా … జగన్ పాలన లోపల విషయంలో ఆయన ఏవిధంగా పోరాడుతున్నారో మేము అదే రీతిలో… ప్రభుత్వంపై పోరాడుతున్నామని… కలిసి పని చేస్తే చేయొచ్చు.. అంటూ చింతమనేని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేసి ఉంటే మళ్లీ ఎమ్మెల్యే అయ్యేవాడిని… లేకపోతే ఆయన అయ్యేవాళ్ళు.. అంటూ చింతమనేని ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
గోదావరి జిల్లాలో ఓట్లు చీలకుండా పవన్ టిడిపి తో..
పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క కచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు చంద్రబాబు ఇతర పార్టీలను కలుపుకుని వైయస్ జగన్ మీద పోటీకి వెళతారని వార్తలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ టిడిపి తో కలిస్తేనే చంద్రబాబు కి చాలా బెనిఫిట్ ఉంటుందని.. గోదావరి జిల్లాలో ఓట్లు చీలకుండా ఉంటాయని..విశేషకులు అంటున్నారు. అంతమాత్రమే కాకుండా పరిషత్ ఎన్నికల సమయంలో గోదావరి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ అదే రీతిలో జనసేన పార్టీ క్యాడర్ కొన్ని చోట్ల కలిసి పని చేసినట్లు.. పరిషత్ ఎన్నికల టైంలో వార్తలు వచ్చాయి. దీంతో కచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు చంద్రబాబుతో పవన్ కలవడం గ్యారెంటీ అని బలంగా వార్తలు వస్తున్న తరుణంలో చింతమనేని చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోపక్క ఇప్పటికే పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో పెద్దగా అంటీ అంటనట్టు గా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీంతో ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు చంద్రబాబుతో ఆయన చేతులు కలపడం గ్యారెంటీ అనే టాక్ గట్టిగా వినబడుతోంది.