అమరావతి: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అంశాలపై తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తన క్యారెక్టర్ను అవమానపరిచే రీతిలో చూపించారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలను నిలిపివేయాలని ఆయన పిటిషన్లో కోరారు. ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, దర్శకుడు రామ్గోపాల్ వర్మ, జబర్దస్త్ కమెడియన్ రాము తదితరులను చేర్చారు. కెఏ పాల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది.
ఈ నెల 29న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా రిలీజ్ కానున్నది.