నాగబాబు ఆధ్వర్యంలో జీ తెలుగులో అదిరింది షో చాలా సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ తరహాలోనే అదిరింది షో కి టెలివిజన్ ప్రేక్షకులలో మంచి ఆదరణ లభిస్తుంది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ షో ప్రతి ఆదివారం ఆడియన్స్ ని అంతగా ఎంటర్టైన్ చేస్తూ ఉంది. సోలో కామెడీ చాలా న్యాచురల్ గా ఉండటంతో పాటు అసభ్యకరమైన మాటలు అలాంటివేవి లేకుండా స్కిట్ లు ఉండటంతో.. టిఆర్పి రేటింగులు కూడా బాగా వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ షో లోకి ఇటీవల శ్రీముఖి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. షోలో తన వాక్చాతుర్యంతో పాటు తన అదిరిపోయే అందాలతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా తన పై ఎన్నో పంచులు కూడా వేయించుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల బొమ్మ అదిరింది ప్రోమో లో భాగంగా సద్దాం హుస్సేన్ స్కిట్ చేస్తున్న సమయంలో.. రాజు వేషంలో శ్రీముఖి దగ్గరికి వస్తాడు సద్దాం హుస్సేన్. హీరో రాజశేఖర్ లాగా శ్రీముఖి ముందు డాన్స్ చేస్తాడు.
అంతలో స్కిట్ మొదలుపెట్టిన సద్దాం హుస్సేన్ శ్రీముఖి తన మొదటి భార్య అంటు చెబుతాడు.ఈ డైలాగుతో స్టేజ్ పై ఉన్న జానీ మాస్టర్ పక్కనే ఉన్న శ్రీముఖి షాక్ అవుతారు. తనకు జ్యోతిష్యుడు చెప్పాడని వాస్తు ప్రకారం ఈశాన్యం లో బరువు ఉండాలని అందుకే శ్రీముఖి ని పెళ్లి చేసుకున్నాట్లు తెలపటంతో అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. దీంతో ఈ ప్రోమో కి సోషల్ మీడియాలో మంచి ఆదరణ మాత్రమేకాక శ్రీముఖి పై పడిన పంచ్ డైలాగ్ కి మంచి రెస్పాన్స్ నెటిజన్ల నుండి వస్తోంది.